News April 5, 2025

శ్రీరామ నవమి వేడుకకు అయోధ్య సిద్ధం

image

శ్రీ రామ నవమి వేడుకకు అయోధ్య రామ మందిరం ముస్తాబైంది. ఎండల నేపథ్యంలో ప్రత్యేక వసతి కేంద్రాలు నిర్మించినట్లు అధికారులు తెలిపారు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక మార్గాలలో వాహనాలను పంపిస్తున్నారు. శ్రీరామ నవమి వేడుకలను భక్తులందరూ తిలకించేలా భారీ LED స్ర్కీన్లు సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News April 7, 2025

తెలంగాణ ప్రభుత్వంపై బాలీవుడ్ నటి ఫైర్

image

HYD కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బాలీవుడ్ నటి దియా మిర్జా తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ‘కంచ గచ్చిబౌలి పరిస్థితి గురించి తెలంగాణ సీఎం నిన్న ఒక ట్వీట్ చేశారు. నేను నకిలీ AI ఫొటోలు/ వీడియోలు ఉపయోగించానని చెప్పారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రకటన. నేను పోస్ట్ చేసినవి ఒరిజినల్ వీడియోలు. ఇటువంటి వాదనలు చేసే ముందు మీడియా, ప్రభుత్వం వాస్తవాలను ధ్రువీకరించుకోవాలి’ అని ఆమె Xలో రాసుకొచ్చారు.

News April 7, 2025

సమ్మర్ ఎఫెక్ట్.. ధరలు రెట్టింపు

image

AP: ఎండలు పెరుగుతుండటంతో నిమ్మకాయ ధరలు రెట్టింపయ్యాయి. గత నెలలో క్వింటా రూ.6 వేల వరకూ ఉండగా ప్రస్తుతం రూ.12వేలకు చేరింది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏటా 10 లక్షల టన్నుల దిగుబడి వస్తుండగా వేసవిలోనే 4 లక్షల టన్నులు ఉంది. మరోవైపు మార్కెట్‌లో కాయ సైజును బట్టి ఒక్కోటి రూ.5-10 వరకు అమ్ముతున్నారు.

News April 7, 2025

పీయూష్ వ్యాఖ్యలపై స్టార్టప్‌ ఫౌండర్ ఫైర్

image

స్టార్టప్‌ కంపెనీలపై <<15987267>>పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు<<>> కొందరు మద్దతిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. ఓ స్టార్టప్ ఫౌండర్ Xలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘నేను 100మందితో బుర్హాన్‌పూర్‌(MP)లో సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాను. ఇక్కడ విద్యుత్ సమస్య, లంచాల కోసం అధికారుల వేధింపులు సాధారణం. ఈ సమస్యలపై PMO, IAS అధికారులకు లేఖలు రాసినా స్పందన లేదు. సౌకర్యాలు కల్పించకుండా ఇన్నోవేషన్ కావాలంటే ఎలా?’ అని ఫైర్ అయ్యారు.

error: Content is protected !!