News April 5, 2025
బీజేపీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా వేముల ప్రమాణస్వీకారం

నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడిగా వేముల నరేందర్రావు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల వరకు జిల్లా అంతటా పార్టీని బలోపేతం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దిలీప్ ఆచారి, సుధాకర్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 7, 2025
సంగారెడ్డి: యువతి అదృశ్యం.. కేసు నమోదు

యువతి అదృశ్యమైన ఘటన పుల్కల్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ తెలిపిన వివరాలు.. పుల్కల్ గ్రామానికి చెందిన ఓ యువతి (20) ఆదివారం ఉదయం నాలుగు గంటలకు అందరూ నిద్రిస్తుండగా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్లో యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News April 7, 2025
HYD: వర్సిటీల్లో ASST ప్రొఫెసర్ల ఖాళీలు ఇవే!

వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసేందుకు TG ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా OUకు సంబంధించి 601 పోస్టులకు 131 మంది పనిచేస్తుండగా 470 ఖాళీలు ఉన్నాయి. JNTUH పరిధిలో 224 పోస్టుల్లో 86 మంది పనిచేస్తుండగా 138 ఖాళీలు ఉన్నాయి. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి 68 పోస్టులు మంజూరు కాగా 23 మంది పనిచేస్తుండగా 45 ఖాళీలు ఉన్నాయి. కొత్త రిక్రూట్మెంట్ కు జీవో 21 జారీ చేసింది.
News April 7, 2025
MDK: ఆలయాల్లో చోరీకి పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్

దేవాలయాలలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని గుమ్మడిదల పోలీసులు అరెస్ట్ చేశారు. జిన్నారం సీఐ నయుముద్దీన్ వివరాలు.. మెదక్ జిల్లా శివంపేట (M) శభాష్ పల్లికి చెందిన ఫయాజ్(30) సంజీవ్(27) కలిసి గుమ్మడిదల, రామ్ రెడ్డి బావి, కానుకుంట, నల్లవల్లి గ్రామాలలో రాత్రి వేళలో తిరుగుతూ ఊరి బయట ఉన్న దేవాలయాలను ఎంచుకొని హుండీలలో చోరీకి పాల్పడుతున్నట్లు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.