News April 5, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤కోసిగి: పేకాటరాయుళ్ల అరెస్ట్.. రూ.24,550లు స్వాధీనం➤ ఆదోని మార్కెట్లో పెరిగిన పత్తి ధర.!➤ జగ్జీవన్ రామ్ జీవితం అనుసరణీయం: జేసీ➤ విలువలతో కూడిన విద్యను అందించాలి: టీజీ వెంకటేశ్➤ సీఎం చంద్రబాబు నమ్మకద్రోహం చేశారు: హఫీజ్ ఖాన్➤ వర్ఫ్ బోర్డ్ బిల్లుకు రద్దు చేయాలని జిల్లా వ్యాప్తంగా నిరసనలు➤ కర్నూలు: 10th విద్యార్థులకు ఉచిత కోచింగ్➤ ఎమ్మిగనూరు: పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

Similar News

News April 18, 2025

నంద్యాల మెడికల్ విద్యార్థిని కాపాడిన ట్రైనీ IPS

image

నంద్యాలకు చెందిన యువకుడు తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. జీవితంపై విరక్తిచెంది రామచంద్రాపురం మండల పరిధిలోని అడవిలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్నేహితులకు చెప్పాడు. వారు పోలీసులను ఆశ్రయించగా.. రామచంద్రాపురంలో ట్రైనింగ్ తీసుకుంటున్న IPS బొడ్డు హేమంత్ స్పందించారు. 20 నిమిషాల్లో విద్యార్థి ఫోన్ ట్రేస్ చేసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థిని కాపాడి కౌన్సెలిగ్ ఇచ్చారు.

News April 18, 2025

ఎల్లెల్సీకి నిలిచిన నీటి సరఫరా

image

తుంగభద్ర దిగువ కాలువకు నీటి సరఫరా నిలిచిపోయింది. రెండ్రోజుల క్రితం వరకు నీటి సరఫరా కొనసాగగా తాజాగా పూర్తిగా నిలిపివేశారు. తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వలు తగ్గుముఖం పడటంతో ఉన్నతాధికారుల అదేశాల మేరకు నిలిపివేసిటన్లు సమాచారం. టీబీ డ్యాంలో ప్రస్తుతం 7.037 టీఎంసీల నీరు నిల్వ ఉండగా జలాశయానికి ఎలాంటి ఇన్ ఫ్లో లేదు.

News April 18, 2025

కర్నూలులో క్వింటా ఉల్లి రూ.879

image

ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. కర్నూలు మార్కెట్‌కు నిన్న 479 క్వింటాళ్ల సరకు రాగా గరిష్ఠ ధర క్వింటా రూ.879, కనిష్ఠ రూ.675, సగటు రూ.755 పలికింది. మహారాష్ట్ర నుంచి జిల్లాకు భారీగా దిగుమతి అవుతుండటంతో ధరలపై ఎఫెక్ట్ పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక మిర్చి క్వింటా రూ.4వేల నుంచి రూ.7వేల వరకు పలుకుతోంది.

error: Content is protected !!