News April 5, 2025
ట్రంప్ను చూసి భారత్ నేర్చుకోవాలి: అఖిలేశ్ యాదవ్

ట్రంప్ ఇతర దేశాల వస్తువులపై విధిస్తున్న పన్నులను చూసి భారత్ నేర్చుకోవాలని SP అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కాపాడుకోవాలంటే దిగుమతులపై అధిక పన్నులు వేయాల్సిందేనని తెలిపారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోందన్నారు. పేదల తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. గోరఖ్పూర్, అయోధ్యలో ఉన్న వక్ఫ్ భూములను కాజేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Similar News
News April 7, 2025
ఫేక్ ప్రచారంపై ప్రముఖులను విచారించేందుకు ప్రభుత్వం చర్యలు!

TG: HCU భూములపై ఫేక్ ప్రచారం చేసిన ప్రముఖులను విచారించేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ నేత జగదీశ్, నటులు జాన్ అబ్రహం, రవీనా టాండన్, ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ తదితర ప్రముఖులను విచారించనున్నట్లు సమాచారం. కాగా HCU భూములపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈనెల 24లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.
News April 7, 2025
ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట

AP: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆయనను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కావాలని మిథున్ రెడ్డి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
News April 7, 2025
చెప్పులు దాస్తే ₹5వేలే ఇచ్చాడని వరుడిపై కర్రలతో దాడి..

కొన్ని ప్రాంతాల్లో వివాహాల్లో వరుడి చెప్పులను దాచి కట్నం తీసుకోవడం ఆచారం. UP బిజ్నోర్లో ఓ వరుడిని ₹50వేలు డిమాండ్ చేశారు. అతడు ₹5వేలు ఇవ్వడంతో గొడవ జరిగింది. తక్కువ డబ్బు ఇచ్చినందుకు వధువు వైపు మహిళలు వరుడిని ‘బిచ్చగాడు’ అని తిట్టడంతో ఇరు కుటుంబాలు దాడి చేసుకున్నాయి. దీంతో వధువు కుటుంబం (బావమరుదులు) వరుడిని రూమ్లో బంధించి కర్రలతో కొట్టింది. పోలీసుల జోక్యంతో ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరింది.