News April 5, 2025
సిరిసిల్ల: తొలి దశలోనే గుర్తించాలి: డీఎంహెచ్వో

అంగన్వాడీ సెంటర్లలోని పిల్లల లోపాలను ఇతర దశలోనే గుర్తించాలని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్ల పట్టణంలో సమితి అధికారులతో శనివారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 7 నుంచి అంగన్వాడీ పిల్లలకు అప్తాలమిక్ ద్వారా పెరుగుదల లోపాలను తొలి దశలోనే గుర్తించాలన్నారు. అనంతరం మెరుగైన వైద్యం అందించి భవిష్యత్తులో కంటిచూపు సమస్య తీవ్రతను తగ్గించే విధంగా చూడాలని ఆదేశించారు.
Similar News
News April 7, 2025
హైదరాబాద్లో మొదలైన వర్షం

హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. మరికాసేపట్లో MBNR, మేడ్చల్, NGKL, RR, సిద్దిపేట, ములుగు, VKB జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, భద్రాద్రి, MHBD జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, గంటకు 41-61కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మీ ప్రాంతంలో వర్షం పడుతోందా?
News April 7, 2025
KNR: ఇంటర్, పదోతరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్

ఈనెల 20 నుంచి నిర్వహించనున్న ఇంటర్, పదోతరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలకు పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రశ్నపత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. 881 మంది విద్యార్థులకు 4 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
News April 7, 2025
KMR: ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించుకున్నారు. కలెక్టర్ ఒక్కొక్క ఫిర్యాదును స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.