News April 5, 2025
7, 8 తేదీల్లో 2 జిల్లాల్లో పవన్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 7, 8 తేదీల్లో అల్లూరి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. 7న పెదపాడులో పలు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 8న అరకు సమీపంలో సుంకరమెట్ట వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తారు.
Similar News
News April 7, 2025
ఆయుష్మాన్ భార్యకు మళ్లీ క్యాన్సర్

తనకు బ్రెస్ట్ క్యాన్సర్ తిరగబెట్టినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ వెల్లడించారు. రెండోసారి క్యాన్సర్పై యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే వ్యాధి నుంచి విముక్తి పొందుతానని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ అయిన ఈమె ఏడేళ్ల కిందట క్యాన్సర్ చికిత్స చేయించుకున్నారు.
News April 7, 2025
డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం: ఆర్.నారాయణమూర్తి

AP: నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్రం భారీ కుట్రకు తెరతీసిందని ఆయన ఆరోపించారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘డీలిమిటేషన్ ఉత్తరాది రాష్ట్రాలకు మేలు, దక్షిణాది రాష్ట్రాలకు చెడు చేసేలా ఉంది. దురుద్దేశంతోనే కేంద్రం పునర్విభజనకు పూనుకుంటోంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News April 7, 2025
రేపు రాప్తాడుకు మాజీ సీఎం జగన్

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించనున్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. అనంతరం హెలికాప్టర్లో బెంగళూరు బయల్దేరి వెళ్తారు. కాగా జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు.