News April 5, 2025

నేంద్యాల జిల్లాలో నేటి ముఖ్యవార్తలు

image

☞ మండ్లెం శివారులో రోడ్డు ప్రమాదం.. యువకుడి దుర్మరణం ☞ ఆళ్లగడ్డ ఎస్సై వేధింపులతో ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.!☞ గోవింద పల్లెలో ఫ్యాక్షన్ పడగ.! ☞ వైసీపీ కన్వీనర్ ప్రతాప రెడ్డికి కాటసాని పరామర్శ ☞ రైలులో ప్రయాణించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ ☞ బనగానపల్లెలో మంత్రి బీసీ విస్తృత పర్యటన ☞ జిల్లాలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ☞ శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో రెండు చిరుత పులుల సంచారం

Similar News

News January 5, 2026

సింగూరు ప్రాజెక్టులో 20 లక్షల చేప పిల్లల విడుదల

image

సింగూరు ప్రాజెక్టులో మత్స్యకారుల ఉపాధి కోసం 20 లక్షలు చేప పిల్లలను వదలనున్నట్లు మత్స్య శాఖ జిల్లా సహాయ సంచాలకులు ఆర్ఎల్. మదుసూదన్ తెలిపారు. సోమవారం సింగూరు ప్రాజెక్టులో ఈ ఏడాదికి మొదటి విడతగా 2.70 లక్షలు చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు. దఫాలు, దఫాలుగా ప్రాజెక్టులో మొత్తం 20 లక్షల చేప పిల్లలను వదలనున్నామన్నారు. చేప పిల్లలు పెరిగి పెద్దయ్యాక మత్స్యకారులు ఉపాధి పొందవచ్చన్నారు.

News January 5, 2026

తిరుపతి: 5 ఏళ్ల జైలు శిక్ష.. ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫైన్

image

2018లో ఎర్రవారి పాలెంలో నమోదైన కేసులో నలుగురు స్మగ్లర్లకు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.3లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి కోర్టు తీర్పునిచ్చింది. జిల్లా SP సుబ్బరాయుడు ‘గుడ్ ట్రయల్ మానిటరింగ్’ విధానం వల్ల సరైన సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్ష పడింది. అడవుల సంపదను దోచుకునే వారిపై రాజీలేని పోరాటం చేస్తామని, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

News January 5, 2026

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అలసత్వం వీడాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 629 అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీకి ఎండార్స్మెంట్ ఇవ్వాలని, బియాండ్ ఎస్ఎల్ఏ లేకుండా సమస్యలు పరిష్కరించాలన్నారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు సీఎంఓ, ఎమ్మెల్యే, ఎంపీ పెండింగ్ ఫిర్యాదులను పూర్తి చేయాలన్నారు.