News April 5, 2025
నన్ను చంపి పిల్లలను వదిలేసినా బాగుండేది: చెన్నయ్య

TG: ప్రియుడి కోసం రజిత అనే మహిళ <<15981487>>ముగ్గురు కన్నబిడ్డలను<<>> చంపేయడంతో భర్త చెన్నయ్య కన్నీరుమున్నీరవుతున్నారు. తనను చంపి పిల్లలను వదిలేసినా బాగుండేదని రోదిస్తున్నారు. ‘బిడ్డలకు విషం పెట్టి చంపి ఆత్మహత్యాయత్నం చేసినట్లు రజిత నాటకం ఆడింది. పిల్లలు చనిపోయారని చెబితే ఆమెకు చుక్క కన్నీరు రాలేదు. ఆమెను చంపేయడమే మంచిది. ఎన్కౌంటర్ చేయండి. అదే సరైన న్యాయం’ అని కోరుతున్నారు.
Similar News
News April 7, 2025
హైదరాబాద్లో మొదలైన వర్షం

హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. మరికాసేపట్లో MBNR, మేడ్చల్, NGKL, RR, సిద్దిపేట, ములుగు, VKB జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, భద్రాద్రి, MHBD జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, గంటకు 41-61కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మీ ప్రాంతంలో వర్షం పడుతోందా?
News April 7, 2025
మీకోసం నాలుగు సూత్రాలు!

హెల్తీ లైఫ్ కోసం వ్యాయామం ఎంత ముఖ్యమో డైట్, సరైన దినచర్య కూడా అంతే ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ‘రోజులో 12 గంటల వ్యవధిలో ఏమీ తినకుండా ఉండాలి. వారానికి 2 సార్లు 5 ని.ల చొప్పున స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. నిద్ర మన జీవితాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ 20ని.లు ఎండలో నిలబడాలి. రోజులో 15 ని.లు మీకోసం కేటాయించుకొని ఫోన్ పక్కన పెట్టి ఇష్టమైన పనులు చేయాలి’ అని వైద్యులు చెబుతున్నారు.
News April 7, 2025
ప్రయాణికురాలి మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

ముంబై నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానం ఛత్రపతి శంభాజీనగర్లోని ఎయిర్పోర్టులో నిన్న రాత్రి 10 గం.కు అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో ప్రయాణిస్తున్న మీర్జాపూర్కు చెందిన మహిళ సుశీల(89)కి అసౌకర్యంగా అనిపించడంతో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. మెడికల్ టీం పరిశీలించి, అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం విమానం వారణాసికి పయనమైంది.