News April 6, 2025
నిర్మల్: కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జి

జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు ఆవరణంలో కోర్ట్ ఆఫ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ -2 జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆప్ ఫస్ట్ క్లాస్ కోర్టును శనివారం హైకోర్టు జడ్జ్ జస్టిస్ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువలో ఉండటానికి ఈ కోర్టును ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లా ప్రధాన జడ్జి కర్ణ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, జడ్జిలు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 9, 2025
కొంపల్లి రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్ దందా

HYDలో డ్రగ్స్ మాఫియా గట్టును మరోసారి ఈగల్ టీమ్ బట్టబయలు చేసింది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ రాకెట్ను నడుపుతున్న ముఠాను పట్టుకుంది. రెస్టారెంట్ యజమాని సూర్య ఆధ్వర్యంలో ఈ దందా సాగుతోందని పోలీసులు తెలిపారు. సూర్య 23 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తించారు.
News July 9, 2025
పెద్దపల్లి: గానుగ వృత్తి పరిరక్షణకు ప్రభుత్వం కృషి: మంత్రి

తెలంగాణ కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ను గానుగ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డా.లెక్కల నాగేశ్ ఈరోజు పెద్దపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. గానుగ వృత్తి పరిరక్షణ, గాండ్ల యువతకు నైపుణ్య శిక్షణ, సబ్సిడీతో గానుగలు, గాండ్ల కార్పొరేషన్ ఏర్పాటుపై వినతిపత్రం అందించారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ కుల వృత్తుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
News July 9, 2025
గిరి ప్రదక్షిణలో మాధవ స్వామి ఆలయానికి వెళ్తున్నారా..!

సింహాచలం గిరి ప్రదక్షిణ బుధవారం ఉదయం నుంచి ప్రారంభం అయ్యింది. భక్తులు ఇప్పటికే నడక ప్రారంభించారు. అయితే మాధవధారలో సింహాచలం కొండను అనుకోని ఉన్న మాధవస్వామి ఆలయాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకొని గిరి యాత్ర కొనసాగించాలి. అప్పుడు మాత్రమే గిరి ప్రదక్షిణ సంపూర్ణం అవుతుందని పెద్దలు చెబుతున్నారు. అయితే మాధవస్వామి ఆలయం నుంచి మెట్ల మార్గాన సింహాచలానికి దారి కూడా ఉంది.