News April 6, 2025

సిద్దిపేట: యువ రైతు ఆత్మహత్య

image

మద్యానికి బానిసై యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తొగుట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన యువ రైతు మ్యాకల స్వామి(38) వ్యవసాయం చేస్తూ తన కుటుంబం జీవిస్తున్నాడు. స్వామికి గత 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మద్యానికి బానిసై రోజు తాగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో శనివారం ఇంటికి వచ్చిన అతను బాత్రూంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News April 9, 2025

TODAY HEADLINES

image

* పేద బిడ్డల విద్యపై నిర్లక్ష్యం క్షమించరానిది: సీఎం రేవంత్
* పోలీసుల బట్టలు ఊడదీస్తాం: YS జగన్
* అల్ప పీడనం.. రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు
* అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు
* జూన్ నాటికి మెగా డీఎస్సీ: నారా లోకేశ్
* త్వరలో భారీ భూకుంభకోణం బయటపెడతాం: కేటీఆర్
* పదేళ్లలో ఎన్నో కలలను నిజం చేశాం: మోదీ
* ఐపీఎల్‌లో కోల్‌కతాపై లక్నో, చెన్నైపై పంజాబ్ విజయం

News April 9, 2025

IPL: స్టేడియంలో చాహల్ గర్ల్ ఫ్రెండ్ సందడి

image

సీఎస్కే-పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ రూమర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహ్వాష్ సందడి చేశారు. పంజాబ్ వికెట్లు తీసినప్పుడు ఆమె స్టాండ్స్‌లో ఎగిరి గంతులేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ధనశ్రీ వర్మతో విడాకుల అనంతరం చాహల్ ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల చాహల్‌తో కలిసి మహ్వాష్ ఓ మ్యాచ్ కూడా తిలకించారు.

News April 9, 2025

ట్రంప్ టారిఫ్స్.. భారత్ -చైనా ఏకమవ్వాలి: చైనా

image

ఇతర దేశాలపై అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలను భారత్-చైనా కలిసికట్టుగా ఎదుర్కోవాలని చైనా విదేశాంగ రాయబారి యు జుంగ్ కోరారు. ఇరు దేశాల మధ్య జరిగే వ్యాపారం ఎప్పుడూ పరస్పర లబ్ధి చేకూర్చేదిగా ఉంటుందని తెలిపారు. ఈ రెండు దేశాలు కలిసి నిలబడితే USA సుంకాల వల్ల ఇబ్బందులు ఉండవన్నారు. కాగా అమెరికాపై విధిస్తున్న సుంకాలను రద్దు చేయాలని చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇవ్వగా..డ్రాగన్ దేశం లెక్కచేయలేదు.

error: Content is protected !!