News March 26, 2024

హిందుపూరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా వెంకట రాముడు

image

తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా బీవీ వెంకటరాముడును నియమిస్తూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీచేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ కార్యదర్శి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News February 7, 2025

సోమందేపల్లి మండలంలో విషాదం.. వివాహిత సూసైడ్

image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కేతగాని చెరువులో వివాహిత హిమజ(26) పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకుంది. నాలుగేళ్ల క్రితం గ్రామానికి చెందిన ఆదర్శ్‌తో ఆమెకు వివాహమైంది. అప్పటి నుంచి అదే ఊరిలో దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

News February 7, 2025

మాతృ భాషను బోధించాలి: అనంత కలెక్టర్

image

కేంద్రీయ విద్యాలయంలో మాతృ భాష తెలుగును కూడా బోధించాలని, విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. గురువారం గుత్తిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది మార్గదర్శకాల ప్రకారం తరగతి సీట్లను పెంచి అడ్మిషన్స్ పూర్తి చేయాలన్నారు.

News February 6, 2025

మంత్రి పయ్యావులకు సీఎం ర్యాంక్

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో పనితీరు ఆధారంగా సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో అనంతపురం జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్ 24వ ర్యాంక్ సాధించారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.

error: Content is protected !!