News March 26, 2024
వాలంటీర్లకు రూ.50వేలు వచ్చేలా చూస్తా: CBN

ఏపీని కాపాడాలన్న అజెండాతోనే మూడు పార్టీలు కలిసి ప్రజల ముందుకు వస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా యువతతో ఆయన సమావేశమయ్యారు. ‘ఐటీని ప్రోత్సహించి యువతకు కొత్త దారి చూపించా. భవిష్యత్తులో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం. వాలంటీర్లు రూ.30 వేల నుంచి రూ.50వేలు సంపాదించుకునేలా చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాలంటీర్ల జీవితాలు మారుస్తా’ అని చంద్రబాబు తెలిపారు.
Similar News
News September 28, 2025
చిత్తూరు: ‘రేపు కలెక్టరేట్లో గ్రివెన్స్ డే’

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News September 28, 2025
చిత్తూరు: ‘రేపు కలెక్టరేట్లో గ్రివెన్స్ డే’

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News September 28, 2025
చిత్తూరు: కాన్పులు చేయలేక చేతులెత్తేశారు.!

జిల్లాలోని 48 PHCలో ఆగస్టులో కేవలం 53 కాన్పులే జరగాయన్న దారుణం శనివారం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో వెల్లడైంది. GDనెల్లూరు, శాంతిపురం, రొంపిచర్ల, విజయపురం, పులిచర్ల, కల్లూరు PHCలలో కనీసం ఒక్క కాన్పు కూడా నమోదు కాలేదు. అరకొర వసతులు, సిబ్బంది నిర్లక్ష్యంతో చాలా కేసులు చిత్తూరుకు రెఫర్ అవుతున్నా వాటిలో ఎక్కువగా అంబులెన్స్లలోనే కాన్పులు అవుతున్నట్లు సమాచారం. దీనిపై కలెక్టర్ సీరియస్ అయ్యారు.