News April 6, 2025
ADB: పాలిటెక్నిక్లో ప్రవేశాలకు POLYCET

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు పాలిసెట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ బండి రాంబాబు తెలిపారు. ఏప్రిల్ 20లోగా దరఖాస్తు చేసుకోవాలని, మే 13న పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పదోతరగతి పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 9, 2025
ADB: ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

నిర్మల్ పట్టణ ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు అతని 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.
News April 9, 2025
TG మెడికల్ సర్వీసెస్ జనరల్ మేనేజర్గా ADB బిడ్డ

బోథ్కు చెందిన డా.రుక్మారెడ్డి TG మెడికల్ సర్వీసెస్&ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGMSIDC)లో ఔషధాలు, శస్త్ర చికిత్స పరికరాలు విభాగానికి జనరల్ మేనేజర్గా నియమితులయ్యారు. రాష్ట్రంలోని సబ్సెంటర్ల నుంచి మెడికల్ కాలేజీ దవాఖానాల వరకు అన్ని స్థాయిల్లో ప్రభుత్వ దవాఖానాల ఔషధ అవసరాలు పర్యవేక్షణ చేయనున్నారు. కాగా ఆయన ప్రస్తుతం HYD DMHO ఆఫీస్లో ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్నారు.
News April 9, 2025
ఇచ్చోడ: ఇంట్లో ఉరేసుకొని బాలిక మృతి

ఇచ్చోడ మండలంలో ఉరి వేసుకొని చనిపోయిన ఘటన జరిగింది. ఎస్సై తిరుపతి వివరాల ప్రకారం. ముఖరా(బి)కి చెందిన రఫీ గత కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులతో మద్యం తాగి వచ్చి రోజు గొడవ పడేవాడు. దీంతో మనస్థాపానికి గురైన కూతురు షేక్ ఫిర్దోసి(16) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. తల్లి జాబీనాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.