News April 6, 2025
నంచర్ల- గుంతకల్లు మధ్య రైల్వే డబుల్ లైన్

అనంత జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్ మల్లప్పగేట్ నుంచి కర్నూలు నంచర్ల మధ్య డబుల్ లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. గుంతకల్లు రైల్వే జంక్షన్ మల్లప్పగేట్ నుంచి KNL చిప్పగిరి, దౌలతాపురం, నంచర్ల మధ్య ఈ ఆర్వో డబుల్ లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రైతుల నుంచి భూసేకరణ చేయనున్నారు. పత్తికొండ ఆర్టీవో పర్యవేక్షణలో భూసేకరణ చేపడుతున్నట్లు రైల్వే అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
Similar News
News April 9, 2025
అక్కాచెల్లెళ్లతో పెళ్లి.. యువకుడికి అధికారుల షాక్

అక్కాచెల్లెళ్లతో పెళ్లికి సిద్ధమైన యువకుడికి అధికారులు షాక్ ఇచ్చారు. గోరంట్ల మండలంలోని గుమ్మయ్యగారి పల్లికి చెందిన ఓ యువకుడు ఇద్దరు యువతులతో వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అందుకు సంబంధించిన పెళ్లి పత్రికలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇద్దరు యువతులు మైనర్లు కావడంతో ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు పెళ్లిని నిలుపుదల చేశారు. యువకుడి కుటుంబ సభ్యులకు స్టేషన్లో సీఐ శేఖర్ కౌన్సిలింగ్ ఇచ్చారు.
News April 9, 2025
అనంతం: రాష్ట్ర వ్యాప్తంగా AP-ECETకు దరఖాస్తులు

అనంతపురం JNTU నిర్వహిస్తున్న APECET-2025 పరీక్షకు అపరాధ రుసుము లేకుండా 33,454 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు APECET ఛైర్మన్ హెచ్.సుదర్శన రావు, కన్వీనర్ దుర్గాప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి రూ.1,000 అపరాధ రుసుముతో ఈనెల 12 వరకు.. రూ.2,000 అపరాధ రుసుముతో ఈ నెల 17 వరకు.. రూ.4,000 అపరాధ రుసుముతో ఈనెల 24 వరకు.. రూ.10,000 అపరాధ రుసుముతో ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.
News April 9, 2025
అర్జీ సమస్యను స్వయంగా తీర్చిన అనంత కలెక్టర్

క్షేత్రస్థాయిలో రెవెన్యూ సదస్సులలో ఇచ్చిన (పీజీఆర్ఎస్) అర్జీని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం ఆత్మకూరు మండల కేంద్రం పరిధిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీని జిల్లా కలెక్టర్ పరిశీలించి, అర్జీదారుల పిటిషన్పై సమగ్రంగా పరిశీలన చేశారు. ఆత్మకూరు మండల కేంద్రం పరిధిలోని హరిజన లక్ష్మమ్మ అనే అర్జీదారులు ప్రజా సమస్యను పరిశీలించారు.