News April 6, 2025

రోడ్డు ప్రమాదంలో ASI మృతి

image

రోడ్డు ప్రమాదంలో ASI మృతి చెందిన ఘటన శనివారం పుత్తూరు(మ) వేపగుంట క్రాస్ వద్ద చోటు చేసుకుంది. వేపగుంటకు చెందిన రఘుకుమార్ తిరుపతి MRపల్లెలో ఆర్ముడు రిజర్వు పోలీస్ ఫోర్స్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. నిన్న రాత్రి విధులు ముగించుకుని బస్సులో వస్తూ వేపగుంట వద్ద దిగాడు. అక్కడ రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.  

Similar News

News April 9, 2025

భారత్‌కు మరో 26 రఫేల్ యుద్ధ విమానాలు!

image

26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం తుది దశకు వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రూ.63 వేల కోట్ల అగ్రిమెంట్‌పై త్వరలో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారని వెల్లడించాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇండియన్ నేవీకి 22 సింగిల్ సీటర్, 4 ఫోర్ సీటర్ విమానాలు సమకూరుతాయని పేర్కొన్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

News April 9, 2025

వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

image

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగిస్తూ సీఐడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో జైలులో ఉన్న ఆయనతో పాటు మరో 9 మంది రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియడంతో అధికారులు కోర్టులో హాజరుపరిచారు. వారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలన్న పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమేరకు ఆదేశాలిచ్చింది.

News April 9, 2025

నరసరావుపేట: వాల్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

పల్నాడు జిల్లాలో ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ అరుణ్ బాబు గోడ పత్రికలు ఆవిష్కరించారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమం జరిగింది. డీఈఓ చంద్రకళ, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!