News April 6, 2025
భద్రాద్రి: గోదావరి తీరం రామమయం..!

రామనామ స్మరణతో గోదావరి తీరం మార్మోగనుంది. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల్లో రామయ్య మురవనున్నాడు. వైభవోపేతంగా జరిగే సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి రెండు కళ్లు సరిపోవు. జై శ్రీరామ్ అంటూ భద్రాచలం తీరంలోని గోదావరి సవ్వడులు పరవళ్లు తొక్కుతాయి. ప్రతి ఏటా వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
Similar News
News April 9, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో BJP పాగా వేసేనా?

దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ తెలంగాణపై గురి పెట్టింది. ఈ క్రమంలో ఇటీవల ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నెల్లూరి కోటేశ్వరరావు, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించింది. స్థానిక సంస్థలు, శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా వారు దూకుడు పెంచారు. ఇటీవల ఎంపీ ఎన్నికల్లోనూ గతంలో కంటే మెరుగైన ఓట్ల శాతం రాబట్టింది. ఎంత వరకు విజయం వరిస్తుందో చూడాలి. దీనిపై మీ కామెంట్..
News April 9, 2025
కొత్తగూడెం: చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో హత్య

చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో వ్యక్తిని హత్య చేసిన ఘటన కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో చోటుచేసుకుంది. సీఐ అశోక్ వివరాలిలా.. మండలంలోని జెడ్ వీరభద్రపురానికి చెందిన కొమరం రాముడు గతనెల11న అదృశ్యంకాగా, మృతదేహం మంగళవారం ఆ గ్రామ చెరువులో లభ్యమైంది. చేతబడి వల్లే తమ కుటుంబ సభ్యులు చనిపోయారని మృతుడి బంధువులు వెంకటేశ్వరావు, పద్దం బాలరాజు రాముడిపై పగ పెంచుకొని హత్య చేసి, చెరువులో పడేశారని సీఐ చెప్పారు.
News April 9, 2025
ఖమ్మంలో మిర్చిబోర్డు ఏర్పాటైతే క్వింటా రూ.25వేలు

మిర్చి సాగులో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో నిలువగా, రాష్ట్రంలో ఖమ్మం ప్రథమ స్థానంలో ఉంది. కానీ ఖమ్మం మిర్చి రైతుల చిరకాల వాంఛ మిర్చి బోర్డు ఏర్పాటుపై సంధిగ్ధo నెలకొంది. ప్రస్తుతం ధరలు క్వింటాకు రూ.13-15 వేల మధ్యే నడుస్తుండగా, బోర్డు ఏర్పాటైతే రూ.20-25 వేలు పలుకుతుందనే ఆశలు వారిలో రేకేత్తిస్తున్నాయ్. నిర్ణీత ధర లేక నష్టపోతున్న రైతన్నలు బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.