News April 6, 2025
కామారెడ్డి: రేపు కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్లు ప్రారంభం

కామారెడ్డి జిల్లాలో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్లను సోమవారం ప్రారంభించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 18 కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, వాటిని ఫార్చునర్ ద్వారా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజన్ పౌల్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జిల్లా పోలీస్ శాఖ ద్వారా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Similar News
News April 9, 2025
సీతారాముల కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్

ప్రతి ఒక్కరూ కార్యదీక్షతో విధులు నిర్వర్తించి, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కడప కలెక్టరేట్లో శ్రీ కోదండరామస్వామివారి కళ్యాణోత్సవ విధుల నిర్వహణపై ఒక్కరోజు శిక్షణలో భాగంగా వారికి కేటాయించిన అంశాల్లో పనుల పురోగతిపై సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన విధులను సమర్ధవంతంగా పూర్తి చేయాలన్నారు.
News April 9, 2025
SMలో మహిళలకు వేధింపులు.. CMకు విజయశాంతి విజ్ఞప్తి

సోషల్ మీడియాలో కొందరు చేసే కామెంట్స్ మహిళలకు బాధను, పనిచేయలేని పరిస్థితులను కలిగిస్తున్నాయని ఎమ్మెల్సీ విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘మహిళలు చేసే కంప్లైంట్పై తక్షణమే స్పందించి చర్యలు తీసుకునే సంపూర్ణ అధికారాలతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దీనిద్వారా అరెస్టులు, ఇతర చర్యలు తీసుకున్నట్లయితే మహిళా లోకానికి ఆత్మస్థైర్యం, విశ్వాసం లభిస్తుంది’ అని సీఎం రేవంత్కు ఆమె విజ్ఞప్తి చేశారు.
News April 9, 2025
పంచాయతీ రాజ్ శాఖలో పదోన్నతులు.. కీలక నిర్ణయం

AP: పంచాయితీ రాజ్ వ్యవస్థలో పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం జీవో 35ను విడుదల చేసింది. MPDO కార్యాలయాల్లోని పంచాయతీ విస్తరణ అధికారుల క్యాడర్ను డిప్యూటీ MPDOగా మార్పు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీనిపై పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల సంఘం నేత జగన్ మోహన్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు MPDO పోస్టుల భర్తీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టారని, ఇక నుంచి పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారని చెప్పారు.