News April 6, 2025
HYD: శోభాయాత్ర.. ఈ రూట్లు బంద్!

శ్రీ రామనవమి శోభాయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని HYD పోలీసులు తెలిపారు. సౌత్ వెస్ట్ జోన్లో 9AM నుంచి 4PM వరకు, ఈస్ట్ జోన్లో 2PM నుంచి 9PM వరకు ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది. 20 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, MJ మార్కెట్, పుత్లీబౌలి మీదుగా సుల్తాన్బజార్కు ర్యాలీగా వెళ్తారు. ప్రత్యామ్నాయ రూట్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.SHARE IT
Similar News
News September 9, 2025
మాజీ సీఎం కలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలి: రాజాసింగ్

హుస్సేన్సాగర్లోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ హుస్సేన్సాగర్ను కొబ్బరినీళ్లతో నింపుతామన్న కలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థను వేరే చోటికి తరలిస్తే సాగర్ను మంచినీటితో నింపవచ్చని సూచించారు.
News September 8, 2025
RR: పింఛన్దారులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్

అధికారంలోకి రాగానే పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి అధికారం చేపట్టి 2 ఏళ్లు కావస్తున్నా పింఛన్ పెంచకుండా మోసం చేస్తున్నట్లు MRPS చీఫ్ మందకృష్ణ మాదిగ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు పింఛన్దారులతో కలిసి సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ సర్కార్ వెంటనే పింఛన్ పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
News September 8, 2025
HYD: 3 లక్షల 3 వేల విగ్రహాల నిమజ్జనం

గణేష్ నిమజ్జనం విజయవంతంగా జరిగిందని GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు గ్రేటర్ వ్యాప్తంగా 3 లక్షల 3 వేల విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు వెల్లడించారు. పకడ్బందీ ప్రణాళిక, పటిష్టమైన ఏర్పాట్లతో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు GHMC, పోలీసు, విద్యుత్, హెచ్ఎండీఏ, హైడ్రా, రెవెన్యూ, విద్యుత్, పారిశుద్ధ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు.