News April 6, 2025

ఒంటిమిట్టలో 11న సీతారాముల కళ్యాణం

image

తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం భద్రాచలం, ఏపీ ప్రభుత్వం ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకలు జరుపుతున్నాయి. భద్రాచలంలో శ్రీరామనవమి రోజు రాములోరి కళ్యాణం జరుపుతుండగా, ఒంటిమిట్టలో మాత్రం చతుర్దశి, పున్నమి రోజు చంద్రుడు వీక్షించేలా రాత్రి సమయంలో కళ్యాణం నిర్వహిస్తారు. ఈ సారి ఏప్రిల్ 11న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో కళ్యాణం జరగనుంది.

Similar News

News April 14, 2025

ICC మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా మరోసారి గంగూలీ

image

టీమ్‌ఇండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ మరోసారి ICC మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైనట్లు ICC వెల్లడించింది. ఈ కమిటీలో VVS లక్ష్మణ్ తిరిగి ప్యానెల్ మెంబర్‌గా చేరారు. వీరితో పాటు హమీద్ హసన్(AFG), డెస్మండ్ హేన్స్(WI), టెంబా బావుమా(SA), జోనాథన్ ట్రాట్‌(ENG) కమిటీలో ఉన్నారు. గంగూలీ మూడేళ్లు ఈ పదవిలో కొనసాగనున్నారు. దాదా తొలిసారి 2021లో క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా నియామకమైన విషయం తెలిసిందే.

News April 14, 2025

సమ్మర్‌లో కీరదోసతో ఎన్నో లాభాలు!

image

* కీరదోసలోని 96% నీటి వల్ల డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తదు.
* అంతర్గత వాపు, కండరాల నొప్పిని తగ్గిస్తుంది.
* పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
* చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది.
* నోటి దుర్వాసన తగ్గడంతో పాటు శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది.
* బరువు తగ్గాలనుకునే వారికి కీరదోస మంచి ఆయుధం.
* కీరలోని డైయూరిటిక్‌ గుణాలు మూత్రం ద్వారా టాక్సిన్స్‌ బయటకు పంపుతాయి.

News April 14, 2025

ఎలక్ట్రానిక్ వస్తువులపై US కొత్త టారిఫ్‌లు?

image

US అధ్యక్షుడు ట్రంప్ ఎలక్ట్రానిక్ వస్తువులపై ఇచ్చిన టారిఫ్‌ల మినహాయింపు కొద్ది రోజులే అని తెలుస్తోంది. త్వరలోనే వాటితో పాటు ఔషధాలపైనా టారిఫ్ బాంబ్ పేల్చనున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లు తదితర వస్తువులు ప్రత్యేక సుంకాల పరిధిలోకి వస్తాయని ఆ దేశ వాణిజ్యశాఖ మంత్రి హోవార్డ్ వెల్లడించినట్లు తెలిపింది. 2 నెలల్లో కొత్త సుంకాలు విధించనున్నట్లు వివరించింది.

error: Content is protected !!