News April 6, 2025

నిర్మల్: ‘ఎస్ఎస్సీ స్పాట్‌కు రిపోర్ట్ చేయాలి’

image

పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కోసం నియమించబడ్డ ఏసీఓలు, సీలు, ఏఈలు, స్పెషల్ అసిస్టెంట్లు, క్యాంపు సిబ్బంది సోమవారం ఉదయం 8 గంటల లోపు రిపోర్ట్ చేయాలని డీఈవో రామారావు సూచించారు. అధికారులు 12 గంటలలోపు క్యాంప్ అధికారికి రిపోర్ట్ చేయడంలో విఫలమైతే వారిపై సీసీఏ నియమాల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయన్నారు.

Similar News

News November 9, 2025

మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం: అనగాని

image

AP: తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏ పని ఉన్నా అది రెవెన్యూ ఉద్యోగుల వల్లే సాధ్యమన్నారు. ‘గతంలో ఉద్యోగులను ఇబ్బందులు పెట్టారు. YCP ప్రభుత్వం భూమి సమస్యలు సృష్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ సభల ద్వారా ఆ సమస్యలు పరిష్కరించాం’ అని అనంతపురం జిల్లా పర్యటనలో అన్నారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధికి రెవెన్యూశాఖ పాత్ర కీలకం అని మరో మంత్రి పయ్యావుల చెప్పారు.

News November 9, 2025

శంషాబాద్: మూడు విమానాలు రద్దు

image

వివిధ గమ్యస్థానాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి ఆదివారం రాకపోకలు సాగించే మరో 3 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి HYD రావాల్సిన విమానం, జైపూర్‌ నుంచి HYD రావల్సిన 2 విమానాలు రద్దయ్యాయి. అలాగే సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.

News November 9, 2025

నాగర్‌కర్నూల్: బస్సు ఆపలేదని శ్రీశైలం రహదారిపై మహిళల ధర్నా

image

నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్ చౌరస్తాలో శ్రీశైలం జాతీయ రహదారిపై మహిళలు ధర్నా చేపట్టారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం వెళ్లేందుకు గంటల తరబడి ఎదురుచూసినా ఒక్క బస్సు ఆపకపోవడంతో ఆగ్రహంతో బస్సును అడ్డగించారు. ఈ సంఘటనతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారి జోక్యంతో సమస్య సద్దుమణిగింది, అనంతరం మహిళలు తమ ప్రయాణం కొనసాగించారు.