News April 6, 2025
భద్రాద్రి: గెస్ట్ హౌస్ నుంచి మిథిలా స్టేడియానికి సీఎం

బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడి నుంచి భద్రాచల సీతారామ చంద్ర స్వామి వారి కళ్యాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావుతో కలిసి మిథిలా స్టేడియానికి వెళ్లారు.
Similar News
News July 6, 2025
KNR నుంచి అరుణాచలానికి RTC ప్రత్యేక బస్సు

ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అరుణాచలానికి KNR నుంచి సూపర్ లగ్జరీబస్సును ఏర్పాటుచేసినట్లు DM తెలిపారు. ఈనెల 8న KNR బస్టాండ్ నుంచి బయలుదేరి 9న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరిప్రదక్షిణ, దర్శనమనంతరం 10న అరుణాచలం నుంచి బయలుదేరి మరుసటి రోజు జోగులాంబ దర్శనం తర్వాత 11న సాయంత్రం వరకు KNRకు చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.4700, పిల్లలకు రూ.3540 చార్జీగా నిర్ణయించారు.
News July 6, 2025
మా విషయం ఇండియా మొత్తం తెలుసు: చాహల్

ఆర్జే మహ్వాష్తో డేటింగ్పై టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ స్పందించారు. కపిల్ శర్మ షోలో అతడి డేటింగ్ ప్రస్తావన వచ్చింది. ‘కౌన్ హై వో లడ్కీ’ అంటూ కపిల్ ప్రశ్నించారు. దీనికి చాహల్ స్పందిస్తూ ‘నాలుగు నెలల కిందటే మా డేటింగ్ విషయం ఇండియా మొత్తం తెలుసు’ అని సమాధానమిచ్చారు. ప్రత్యక్షంగా ఆమె పేరు ప్రస్తావించకపోయినా క్లారిటీ ఇచ్చాడని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
News July 6, 2025
వనపర్తి: జీవో నంబర్ 282ను వెంటనే రద్దు చేయాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని దినం 8 గంటల నుంచి పది గంటలకు పెంచుతూ దొడ్డిదారిన జీవో నంబర్ 282 ను తెచ్చిందని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం ) రాష్ట్ర కార్యదర్శి పి సురేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కార్మికులు దశాబ్దాలుగా పోరాడి ఎనిమిది గంటల పరిధిలో సాధించుకున్నారన్నారు. శ్రమదోపిడి చేసే అందుకే 10 గంటలకు పెంచారని, జీవో రద్దు చేయాలన్నారు.