News April 6, 2025
పిఠాపురంలో టీడీపీ నేతలపై కేసు

AP: పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు <<15990895>>పర్యటన సందర్భంగా <<>>జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య బలప్రదర్శన వాగ్వాదానికి దారి తీసింది. తనను దూషించారని జనసేన నేత ఫిర్యాదుతో చినజగ్గంపేటకు చెందిన TDP నేతలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
Similar News
News April 12, 2025
సత్తా చాటిన అమ్మాయిలు

AP: ఇంటర్ ఫలితాల్లో మరోసారి అమ్మాయిలు సత్తా చాటారు. రెగ్యులర్ ఫస్టియర్లో 66 శాతం మంది బాలురు ఉత్తీర్ణులైతే బాలికలు 75 శాతంతో పైచేయి సాధించారు. సెకండియర్లో అబ్బాయిలు 80 శాతం, అమ్మాయిలు 86 శాతం మంది పాసయ్యారు. ఒకేషనల్ ఫస్టియర్లో బాలురు 50 శాతం, బాలికలు 71 శాతం, సెకండియర్లో అబ్బాయిలు 67 శాతం, అమ్మాయిలు 84 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
News April 12, 2025
IPL: గుజరాత్ ఆటగాడికి గాయం

గుజరాత్ టైటాన్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ గాయం కారణంగా వైదొలగినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. తిరిగి న్యూజిలాండ్కు పయనమయ్యారని వెల్లడించాయి. SRHతో మ్యాచ్ సమయంలో ఫిలిప్స్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డారు. కాగా ఇవాళ లక్నోతో GT తలపడనుంది.
News April 12, 2025
పాస్ కానివారు నిరాశ చెందొద్దు: మంత్రి లోకేశ్

AP: ఇంటర్ ఫలితాల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు, సిబ్బంది కృషి చేశారని మంత్రి లోకేశ్ అన్నారు. ఉత్తీర్ణత కానివారు నిరాశ చెందవద్దని, రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ రాయాలని సూచించారు. విద్యార్థులు నిరంతరం నేర్చుకోవాలని, జీవితంలో ఉన్నతస్థితికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.