News April 6, 2025

తెనాలి: పోలీసుల అదుపులో రౌడీ షీటర్ లడ్డు

image

తెనాలి ఐతానగర్ చెందిన రౌడీషీటర్ లడ్డు మరోసారి పోలీసులకు చిక్కాడు. పలు నేరాల్లో భాగంగా ఇటీవల పీడి యాక్ట్ నమోదై జైలుకు వెళ్లి వచ్చిన లడ్డు తాజాగా మరో కేసులో ఇరుక్కున్నాడు. కోపల్లెకి చెందిన మహిళపై దాడి చేసిన ఘటనలో బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి లడ్డును అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ లిఫ్ట్ చేయలేదన్న కారణంతో మహిళపై లడ్డు రాడ్డుతో దాడి చేసినట్లు అభియోగాలు ఉన్నాయి.

Similar News

News April 24, 2025

గుంటూరు మిర్చి యార్డ్‌లో నేటి ధరలు

image

గుంటూరు మిర్చి మార్కెట్‌ యార్డుకు గురువారం 90,000 బస్తాలు చేరుకున్నాయి. ఈ మిర్చి ధరలు నాణ్యతను బట్టి భిన్నంగా ఉన్నాయి. 334 రకాల్లో సూపర్ 10 రేట్లు ఇలా ఉన్నాయి. దేశవాళీ రూ.6,000-10,000, డీలక్స్ రూ.10,000-11,000, మద్రాస్ క్వాలిటీ రూ.11,000 పైన ఉన్నాయి. తేజ రకం రెండో కోత (కందుకూరు, పొదిలి) రూ.12,500-రూ.13,000 వరకు పలికింది. 341 రకాలు రూ.7,500-12,000, నంబర్ ఫైవ్ రూ.7,500-రూ.11,000 వరకు ధరలు ఉన్నాయి. 

News April 24, 2025

తెనాలి: బాలికపై లైంగిక దాడి.. కేసు నమోదు

image

తెనాలిలో ఏడవ తరగతి చదువుతున్న బాలికపై NTR (D) మైలవరానికి చెందిన అవినాశ్ లైంగిక దాడికి పాల్పడగా వన్ టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలికకు అవినాశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. ఇటీవల తెనాలి వచ్చిన అతడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు విచారించగా వెలుగులోకి రావడంతో ఫిర్యాదు చేశారు.

News April 24, 2025

ANUలో ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రతిభ

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల 4/4 మొదటి సెమిస్టర్ ఫలితాల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో మొత్తం 638 మంది పరీక్షలు రాయగా 578 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 90.12గా నమోదైంది. రీవాల్యుయేషన్ కోసం మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు.

error: Content is protected !!