News April 6, 2025

దేవీపట్నం: ‘మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యనే హత్య చేశాడు’

image

దేవీపట్నం(M) పాముగండికి చెందిన కె.గంగన్నదొర మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని అతని భార్య పాపయమ్మ (28) హత్య చేసాడని ఎస్సై షరీఫ్ ఆదివారం తెలిపారు. తాగుడుకు అలవాటు పడిన గంగన్న దొర నిత్యం డబ్బులు కోసం ఆమెను వేధించేవాడని పేర్కొన్నారు. అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదని ఆమెను కర్రతో తీవ్రంగా కొట్టి, గొంతు నొక్కి చంపాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News September 15, 2025

పెద్దపల్లి: ఈనెల 19న జాబ్ మేళా

image

నిరుద్యోగ యువకులకు టెలి పెర్ఫార్మెన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు కల్పించుటకు SEP 19న సోమవారం MPDO ఆఫీస్ ఆవరణలోని టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెలి పెర్ఫార్మెన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్‌లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ కాంటెంట్ మోడల్ అనలిస్ట్ పోస్ట్ లు ఖాళీలు ఉన్నాయన్నారు. వివరాలకు 9059506807 సంప్రదించండి.

News September 15, 2025

KMR: నాటి ఇంజినీర్ల సృష్టి ఈ అద్భుతాలు!

image

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు, కౌలాస్ కోట, లింగంపేట బావి, పోచారం ప్రాజెక్టులు ఆనాటి ఇంజినీర్ల నైపుణ్యాన్ని చాటి చెబుతున్నాయి. 103 ఏళ్ల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తన సామర్థ్యాన్ని మించి వరదను తట్టుకుని నిలబడింది. ఈ నిర్మాణాలు ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటూ నాటి ఇంజినీరింగ్ ప్రమాణాలను నిరూపిస్తున్నాయి. ఆనాటి ఇంజినీర్ల కృషికి ఈ కట్టడాలు నిలువెత్తు నిదర్శనం.

News September 15, 2025

అన్ని రాష్ట్రాల్లో ఉమెన్ కమిటీలు ఏర్పాటు చేయాలి: ఓంబిర్లా

image

AP: మహిళల భాగస్వామ్యం లేకుండా వికసిత భారత్ సాధించలేమని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అన్నారు. తిరుపతి మహిళా సాధికార సదస్సులో రెండోరోజు మాట్లాడారు. ‘భద్రత, ఆత్మనిర్భరత ప్రతి మహిళకు అందాలి. స్త్రీలను అన్నిరంగాల్లో మరింత ముందుకు తీసుకొచ్చేలా చర్చించాం. పంచాయతీ స్థాయిలో కంప్యూటర్ సెంటర్ ఉండేలా చూడాలి. అన్ని రాష్ట్రాల్లో ఉమెన్ కమిటీలు ఏర్పాటు చేయాలి. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలనేది PM కల’ అని తెలిపారు.