News April 6, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ పల్నాడు జిల్లాలో వైభవంగా శ్రీరామ నవమి ఉత్సవాలు☞ నరసరావుపేట: చికెన్ స్టాల్స్లో అధికారులు తనిఖీలు☞ వినుకొండ: చెరువులో మునిగి బాలుని మృతి ☞ రొంపిచర్ల: పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు,☞ ఎడ్లపాడు: ఆకట్టుకున్న నాటిక పోటీలు☞ పల్నాడు జిల్లాలో ఘనంగా శ్రీరాముని శోభాయాత్ర
Similar News
News April 17, 2025
గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా

సౌతాఫ్రికాలో జరిగిన ఇన్విటేషనల్ ఈవెంట్లో ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా సత్తా చాటారు. 84.52 మీటర్ల జావిలింగ్ త్రో విసిరి గోల్డ్ మెడల్ సాధించారు. మెుత్తంగా ఆరుగురు పోటీపడ్డ ఈ ఇన్విటేషనల్ ఈవెంట్లో విజేతగా నిలిచారు. వచ్చే నెలలో దోహా డైమండ్ లీగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నీరజ్ చోప్రా తన సీజన్ను విజయంతో ప్రారంభించారు.
News April 17, 2025
కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి. గోపి బాధ్యతలు

కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి. గోపి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న అరుణ సారెక చిత్తూరుకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో విశాఖపట్నం వ్యాట్ కోర్టు అప్పలెట్ జడ్జిగా ఉన్న గోపి నియమితులయ్యారు. నేడు ఆయన జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు.
News April 17, 2025
పోలవరం: మట్టి నాణ్యతను పరిశీలిస్తున్న కేంద్ర నిపుణులు

పోలవరం ప్రాజెక్టు పరిధిలో మట్టి నాణ్యత పరీక్షలు గురువారం కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర నిపుణుల బృందం దండంగి, పోలవరం జల విద్యుత్ కేంద్రం పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో మట్టి నమూనాలు సేకరించారు. ఈ మట్టిని స్థానికంగా లేబరేటరీలో పరీక్షతోపాటు మరింత సూక్ష్మంగా తమ కేంద్ర కార్యాలయంలో మట్టిని పరిరక్షిస్తామని అధికారులు తెలిపారు.