News April 7, 2025

MTM: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు ఆయా కార్యాలయాలలో అర్జీలు ఇవ్వవచ్చన్నారు.

Similar News

News April 8, 2025

గన్నవరం: చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

image

గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను ఆత్కూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. మార్చి 31వ తేదీ రాత్రి ద్వారకా రాణి అనే మహిళ తన భర్తాతో కలిసి బైక్‌పై పొట్టిపాడు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చి మెడలోని గొలుసు లాక్కొని పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 16 కాసుల బంగారాన్ని రెండు బైక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

News April 8, 2025

కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బదిలీ

image

కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారెక చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. విశాఖపట్నం జిల్లా వ్యాట్ కోర్ట్ అప్పిలేట్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న జి. గోపిని జిల్లా జడ్జిగా నియమించారు. రాష్ట్రంలో పలువురు జడ్జ్ ‌లను బదిలీ చేయగా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న మొదటి అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు విశాఖపట్నంకు, SC, ST కోర్టు జడ్జి చిన్నబాబు అనంతపురం జిల్లా పోక్సో కోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు.

News April 7, 2025

NTR: బెట్టింగ్ వివాదం.. యువకుడిపై దాడి

image

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో బెట్టింగ్ విషయమై ఇద్దరు యువకుల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. IPL మ్యాచ్ విషయమై ఇద్దరి మధ్య క్వార్టర్ బాటిల్ పందెం ఒప్పందం కుదిరింది. నవీన్ కుమార్ పందెం ఓడిపోవడంతో మద్యం కొనివ్వాలని కోరగా అతను నిరాకరించాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న మహేశ్ ఖాళీ సీసాతో నవీన్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నవీన్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

error: Content is protected !!