News April 7, 2025
ప్రధాని వ్యాఖ్యలకు చిదంబరం కౌంటర్

తమిళనాడుకు UPA ప్రభుత్వం కంటే అధిక నిధులిచ్చామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందించారు. ఎకానమీ, మ్యాట్రిక్స్ గతంతో పోల్చితే ఎప్పుడూ అధికంగానే ఉంటాయని, ఈ విషయం ఫస్టియర్ ఎకానమీ, స్టూడెంట్ను అడిగినా చెబుతారన్నారు. ప్రతి ఏడాది జీడీపీ పెరిగినట్లే బడ్జెట్ పెరుగుతుందన్నారు. మీ వయసు గత సంవత్సరంతో పోలిస్తే ఒక ఏడాది పెరుగుతుంది కదా అని మోదీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News April 15, 2025
పంజాబ్పై వికెట్ల‘కింగ్’గా ఆవిర్భవించిన నరైన్!

ముల్లాన్పూర్లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో కేకేఆర్ బౌలర్ నరైన్ ఐపీఎల్ రికార్డులకెక్కారు. ఈ మ్యాచ్లో ఆయన 2 వికెట్లు తీశారు. ఈక్రమంలో ఆ జట్టుపై ఆయన తీసిన మొత్తం వికెట్ల సంఖ్య 36కు చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఏ బౌలరైనా ఓ ప్రత్యర్థి జట్టుపై ఇన్ని వికెట్లు తీయడం ఇదే అత్యధికం.
News April 15, 2025
ALERT.. కాసేపట్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షం పడుతుందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, నిజామాబాద్ జిల్లాల్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. వీటితో పాటు గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీచేసింది.
News April 15, 2025
ముంబై ఫెయిల్యూర్కు రోహితే కారణం: మాజీ క్రికెటర్

ఓపెనర్గా రోహిత్ శర్మ రాణించకపోవడం కారణంగానే ముంబై ఇండియన్స్ ఫెయిల్ అవుతోందని భారత మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా వ్యాఖ్యానించారు. ముంబై పైచేయి సాధించాలంటే హిట్మ్యాన్ దూకుడుగా ఆడాలన్నారు. కాగా రోహిత్ ఈ సీజన్లో ఐదు మ్యాచ్ల్లో 0, 8, 13, 17, 18 పరుగులు మాత్రమే చేశారు. MI ఆరు మ్యాచ్ల్లో 4 ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానంలో ఉంది.