News April 7, 2025

SRD: పది మూల్యాంకనానికి ఏర్పాట్లు పూర్తి: డీఈఓ

image

రామచంద్రపురం మండలంలోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలో రేపటి నిర్వహించే పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. 1222 మంది ఉపాధ్యాయులను నియమించామని, మూల్యాంకన కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Similar News

News April 17, 2025

పెద్దపల్లి: రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ఢీ

image

పెద్దపల్లి సమీపంలోని అండుగులపల్లి ఫోర్ లైన్ రాజీవ్ రహదారిపై గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫోర్ లైన్ రోడ్డు మరమ్మతులు జరుగుతున్నందున ట్రాఫిక్‌ను వన్ వే వైపు మళ్లించారు. ఈ క్రమంలో ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 17, 2025

నాణ్యమైన ఆహారం అందించాలి: మేడ్చల్ అదనపు కలెక్టర్

image

మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్ రాధిక గుప్త శామీర్‌పేట్‌లోని అంగన్వాడీ, ప్రైమరీ పాఠశాలలను సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు ప్రైమరీ స్కూళ్లలో అవసరమయ్యే మరమ్మతుల యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. విద్యార్థులకు భోజనాలకు సంబంధించి నాణ్యమైన ఆహారం అందించేలా చూడాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, డీవైఈఈ సునీత, ఐసీడీఎస్ సూపర్‌వైజర్స్ ఉన్నారు.

News April 17, 2025

కడప జిల్లా లెక్చరర్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ ఎన్నిక

image

కొండాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న జి.రామకృష్ణారెడ్డి కడప జిల్లా లెక్చరర్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. కడప పట్టణంలోని STUAP భవనంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం గురువారం ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా కొండాపురం కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్‌లు జయాకర్, రవికుమార్, మహబూబ్ బాషా, వేణుగోపాల్, ప్రిన్సిపల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

error: Content is protected !!