News April 7, 2025

కొత్తగూడెం జిల్లాలో నేడు ప్రజావాణి రద్దు

image

భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం ఉన్నందున సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్‌ వి పాటిల్ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు పట్టాభిషేక కార్యక్రమంలో ఉండటం వల్ల ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు. కావున జిల్లా ప్రజలు ఎవరు కూడా తమ సమస్యలపై ప్రజావాణికి రావొద్దని సూచించారు.

Similar News

News September 13, 2025

GWL: విద్యార్థి దశలోనే మావోయిస్టు సిద్ధాంతాల వైపు

image

హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగి పోయిన మావోయిస్టు మహిళ నేత కల్పన @ సుజాత విద్యార్థి దశ నుంచే మావోయిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. 10వ తరగతి వరకు అయిజలో చదివారు. ఇంటర్, డిగ్రీ గద్వాల MALD కాలేజీ పూర్తి చేశారు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా రాడికల్స్ విద్యార్థి సంఘం వైపు ఆకర్షితులై చివరకు అడవి బాట పట్టారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలుగా కొనసాగుతూ జనజీవన స్రవంతిలో కలిశారు.

News September 13, 2025

IBలో 394 జాబ్స్.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు రేపే చివరి తేదీ. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై, 18-27 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. SC, STలకు ఎగ్జామ్ ఫీజు లేదు. జనరల్, ఓబీసీలు రూ.500 చెల్లించాలి. ఎంపికైన వారికి పేస్కేల్ రూ.25,500 నుంచి రూ.81,100 వరకు ఉంటుంది.<> www.mha.gov.in<<>> సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News September 13, 2025

నిజాంసాగర్: 2 గేట్లు ఎత్తి 13,564 క్యూసెక్కులు విడుదల

image

ఉమ్మడి జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి శనివారం సాయంత్రం 2 గేట్లు ఎత్తి 13,564 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టులోకి 11,887 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.383 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు చెప్పారు. కాగా ప్రాజెక్టు ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.