News April 7, 2025

కోడేరు: మురుగు కాలువలో పడి యువకుడు మృతి

image

మూర్చ వ్యాధితో యువకుడు ప్రమాదవశాత్తు మురుగు కాలువలో పడి మృతి చెందిన ఘటన కోడేరులో ఆదివారం ఉదయం చోటుచేసుకంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. కోడేరు క చెందిన మిద్దె మహేష్ (20) అనే యువకుడు గత కొంతకాలంగా మూర్చ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళుతుండగా ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి ప్రధాన రహదారి పక్కల ఉన్న మురుగు కాలువలో పడి మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News April 17, 2025

ATP: డిస్ట్రిక్ మినరల్ ఫండ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం 

image

అనంతపురం కలెక్టరేట్‌లో గురువారం డిస్ట్రిక్ మినరల్ ఫండ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా మినరల్ ఫండ్ నిధుల వినియోగం, ప్రాజెక్టుల ఎంపిక ఇతర సంబంధిత అంశాల గురించి చర్చించుకున్నారు. కార్యక్రమంలో హిందూపురం MP పార్థసారథి, MLAలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, JC అస్మిత్ రెడ్డి, అమిలినేని సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

News April 17, 2025

వేటగాళ్ల ఉచ్చుకు చిరుత మృతి.. విచారణకు పవన్ ఆదేశం

image

AP: అన్నమయ్య జిల్లా పొన్నూటిపాళెంలో వేటగాళ్ల ఉచ్చుకు ఇటీవల చిరుతతో పాటు దాని కడుపులోని రెండు కూనలు మరణించాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాలు, సమీప గ్రామాల్లో జంతువుల కోసం ఉచ్చులు వేసే వేటగాళ్లు, నేరస్థులపై నిఘా ఉంచాలని స్పష్టం చేశారు.

News April 17, 2025

BREAKING: ఇంగ్లిష్ టీచర్ కళ్యాణి సస్పెండ్: నాగర్‌కర్నూల్ డీఈవో

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నాగనూల్ కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలు కళ్యాణిని సస్పెండ్ చేస్తూ డీఈవో రమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయురాలి వేధింపులు భరించలేక తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు డీఈవో ప్రకటించారు.

error: Content is protected !!