News April 7, 2025

జనగామ: మూడెకరాల్లో పంట సాగు.. ఎకరానికే రైతు రైతుబంధు?

image

మూడెకరాల్లో పంట సాగు చేసినప్పటికీ తమకు రైతు రైతుబంధు అందలేదంటూ రైతులు గ్రామపంచాయతీ ముందు నిరసన చేపట్టిన ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని ఇప్పగూడం గ్రామంలో చోటు చేసుకుంది. 3 ఎకరాల్లో పంట సాగు చేస్తే ఎకరానికే రైతుబంధు అందిందని, ఏఈవోలు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టలేదని రైతులు ఆరోపించారు. గ్రామంలో 72 మందికి రావాల్సి ఉందని, ఇప్పటికైనా రైతుబంధు అందించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు.

Similar News

News April 17, 2025

శ్రీసత్యసాయి: స్వచ్ఛంద కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

image

మున్సిపాలిటీలతోపాటు అన్ని మండల కేంద్రాలలో మూడవ శనివారం చేపట్టిన స్వచ్ఛంద కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం పై కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఈఓఆర్డీలతో కలెక్టర్ గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో 13 శాఖలు భాగస్వామ్యం కావాలన్నారు.

News April 17, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤ ఆదోనిలో 19న జాబ్‌మేళా➤ మంత్రాలయం: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య➤ సీజ్ ద గోడౌన్: ఎంపీ శబరి➤ ఆదోనిలో అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠా అరెస్ట్➤ హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి: జిల్లా ఎస్పీ➤ కోడుమూరు: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి➤ కర్నూలు: సీనియర్ సిటిజన్ ఐడీకి ఆన్‌లైన్ దరఖాస్తులు➤ ప్రతి ఒక్కరికి క్రీడా స్ఫూర్తి అవసరం:డీఐజీ➤ కర్నూలుకు చేరుకున్న కేంద్ర మంత్రి ప్రహల్లాద్ జోషి

News April 17, 2025

పాడేరు: ‘తాగునీటి సమస్యలు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు’

image

ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అల్లూరి జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలు గురించి కలెక్టర్ దినేష్ కుమార్ వివరించారు. జేసీ అభిషేక్ పాల్గొన్నారు.

error: Content is protected !!