News March 26, 2024
అందరితో సంప్రదించాకే నిర్ణయం: ఎమ్మెల్సీ జంగా

అందరితో సంప్రదించిన తర్వాతే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఈ మేరకు జంగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గురజాల నియోజకవర్గంలో అనిశ్చితి రాజకీయాన్ని ఆసరాగా చేసుకుని మీడియాలో రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారని, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్దల సలహాలను, సూచనలను తీసుకొని తుది నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు.
Similar News
News March 22, 2026
గుంటూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే!

గుంటూరులో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ. 320, విత్ స్కిన్ రూ. 300కి విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ. 960 వద్ద స్థిరంగా ఉంది. చేపలలో కొరమేను రూ. 430, రాగండి రూ. 180, బొచ్చెలు రూ. 230. చికెన్ ధరలు పెరగడంతో చేపలను కొనుగోలు చేయడానికి నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి..
News March 22, 2026
గ్యాస్ కొరత లేదు.. ఆందోళన పడొద్దు: గుంటూరు JC

గుంటూరు జిల్లాలో గృహ అవసర గ్యాస్ కొరత లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ భరోసా ఇచ్చారు. గుంటూరు ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎల్.పి.జీ ఏజెన్సీను శనివారం జేసీ తనిఖీ చేశారు. ఏజెన్సీలో ఉన్న కనెక్షన్లు, బుకింగ్ చేసినవి, అందుబాటులో ఉన్న సిలిండర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులతో ముఖాముఖి మాట్లాడి బుక్ చేసిన వివరాలు అడిగి తెలుసున్నారు.
News March 22, 2026
గ్యాస్ కొరత లేదు.. ఆందోళన పడొద్దు: గుంటూరు JC

గుంటూరు జిల్లాలో గృహ అవసర గ్యాస్ కొరత లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ భరోసా ఇచ్చారు. గుంటూరు ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎల్.పి.జీ ఏజెన్సీను శనివారం జేసీ తనిఖీ చేశారు. ఏజెన్సీలో ఉన్న కనెక్షన్లు, బుకింగ్ చేసినవి, అందుబాటులో ఉన్న సిలిండర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులతో ముఖాముఖి మాట్లాడి బుక్ చేసిన వివరాలు అడిగి తెలుసున్నారు.


