News April 7, 2025

సిద్దిపేట: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

తాగిన మైకంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. ఎల్ బంజరుపల్లి గ్రామానికి చెందిన బొమ్మ రాజు (35) కుమ్మరి పని చేస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే పనికి వెళ్లిన సరితా ఇంటికి తిరిగి వచ్చే వరకు రాజు ఇంట్లో ఉరి వేసుకున్నట్టు తెలిపింది. ప్రతి రోజు మద్యం సేవించి వచ్చేవాడని రాజు భార్య సరితా పోలీసులకు తెలిపింది.

Similar News

News April 18, 2025

వికారాబాద్: జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✔వికారాబాద్‌: ఈదురు గాలులతో భారీ వర్షం ✔ప్రధాని దిష్టిబొమ్మ దహనం.. చర్యలు తీసుకోవాలి’:BJP ✔పరిగి: పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి: పొంగులేటి ✔VKB: కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు: ఏసుదాస్ ✔సన్న బియ్యంపై అసత్య ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు: కలెక్టర్ ✔TNDR: వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి: ఎమ్మెల్యే ✔IPL బెట్టింగ్.. జర జాగ్రత్త: ఎస్సైలు

News April 18, 2025

HYD: SUMMER బయట పడుకుంటున్నారా?

image

HYD ప్రజలకు రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. వేసవితాపాన్ని తట్టుకోలేక తలుపులు తీసి వరండాల్లో, స్లాబ్‌పైన పడుకోకూడదని హెచ్చరించారు. ఒకవేళ పడుకోవాల్సి వస్తే ఇంట్లో ఒక్కరైనా పడుకునేలా చూసుకోవాలని, మీ ఆభరణాలను సురక్షిత ప్రదేశంలో భద్రపరుచుకోవాలని, దొంగల ముఠాలు ఇదే అవకాశంగా తీసుకుని దోచేస్తారని వివరించారు. అపరిచితులను గుర్తిస్తే 100, 112, 8712662111 కాల్ చేయాలని సూచించారు.

News April 18, 2025

JEE మెయిన్ ‘కీ’ తొలగించిన NTA

image

JEE మెయిన్ ఫలితాల విడుదల వేళ విద్యార్థులను NTA అయోమయానికి గురి చేస్తోంది. ఇవాళ సాయంత్రం అధికారిక వెబ్‌సైట్‌లో ఫైనల్ కీ విడుదల చేసి, కొద్దిసేపటికి దాన్ని తొలగించింది. దీంతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఇవాళ రిజల్ట్స్ వెల్లడించనున్నట్లు ప్రకటించగా, ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంపై NTAపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

error: Content is protected !!