News April 7, 2025
సిద్దిపేట: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

తాగిన మైకంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. ఎల్ బంజరుపల్లి గ్రామానికి చెందిన బొమ్మ రాజు (35) కుమ్మరి పని చేస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే పనికి వెళ్లిన సరితా ఇంటికి తిరిగి వచ్చే వరకు రాజు ఇంట్లో ఉరి వేసుకున్నట్టు తెలిపింది. ప్రతి రోజు మద్యం సేవించి వచ్చేవాడని రాజు భార్య సరితా పోలీసులకు తెలిపింది.
Similar News
News September 15, 2025
నిర్మల్ జిల్లాలో మోస్తరు వర్షాలు

గడిచిన 24 గంటల్లో నిర్మల్ జిల్లాలో 75.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. దిలావర్పూర్ మండలంలో అత్యధికంగా 23.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మామడలో 17.8, కుంటాల 7.6, నిర్మల్ 5.4, తానూర్, సోన్ మండలాల్లో 3.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 4.0 మిల్లీమీటర్లుగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
News September 15, 2025
NLG: సిరులు కురిపించనున్న తెల్ల బంగారం..!

పత్తి సాగు నల్గొండ జిల్లా రైతులకు సిరులు కురిపించనుంది. జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయ శాఖ అంచనాలకు మించి రైతులు పత్తి పెద్ద ఎత్తున సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 5,47,735 ఎకరాల్లో పత్తి సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేయగా అంచనాకు మించి 5,64,585 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. జిల్లాలో మొదటి దశ పత్తితీత పనులను ఇటీవల రైతులు ప్రారంభించారు. 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా.
News September 15, 2025
మంత్రి కందులను కలిసిన తూ.గో కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం విజయవాడలో మంత్రి కందుల దుర్గేశ్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని ప్రధాన సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రికి వివరించారు. జిల్లాలో పర్యాటక, సాంస్కృతిక, సినీ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో వేగంగా అభివృద్ధి పనులు చేపడతామని కలెక్టర్ తెలిపారు.