News April 7, 2025

MNCL:GOOD NEWS.. 7 నుంచి కంటి పరీక్షలు

image

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్ల లోపుచిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లావైద్యారోగ్యశాఖ అధికారి డా.హరీశ్ రాజ్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 8 ఆర్బీఎస్కే బృందాలతో 37, 920 మంది పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.

Similar News

News April 18, 2025

తిరుమలలో టీటీడీ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు

image

తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. దర్శనం పూర్తి చేసుకున్న భక్తులను వ్యక్తిగతంగా ప్రశ్నించి, ఏర్పాట్లపై అభిప్రాయాలు సేకరించారు. శానిటేషన్, క్యూ లైన్లు, తాగునీరు వంటి సదుపాయాలపై ప్రత్యక్షంగా పరిశీలించారు. లడ్డూ, అన్నప్రసాదాలు నాణ్యతను పరిశీలించారు.

News April 18, 2025

జగిత్యాల: రెప్యూటెడ్ జూనియర్ కళాశాలల స్కీంకు దరఖాస్తులు

image

2025 -26 విద్యా సంవత్సరానికి రెప్యూటెడ్ జూనియర్ కళాశాలల స్కీంకు జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ తెలిపారు. అన్ని వసతులు, మంచి ఉత్తీర్ణత కలిగి ఉన్న కళాశాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ నెల 30లోగా ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని దరఖాస్తులను మే 1లోగా సమర్పించాలన్నారు.

News April 18, 2025

కరీంగనర్: ఏప్రిల్ 30 వరకు LRS చెల్లిస్తే 25% రాయితీ

image

గురువారం హైదరాబాద్ నుంచి ‌రాష్ట్ర మున్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ LRSపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 30 వరకు LRS చెల్లిస్తే 25% రాయితీ లభిస్తుందని, ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రచారం కల్పించాలన్నారు. ఫీజు చెల్లిస్తే లేఔట్ల ‌భూక్రమబద్ధీకరణ మంజూరు పత్రాలను జారీ చేయాలని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని‌ ఆదేశించారు. ఏసీ ప్రపుల్ దేశాయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!