News April 7, 2025
ALERT: ఆ జిల్లాల వారు జాగ్రత్త!

AP: రాష్ట్రంలో భానుడు భగభగలు పుట్టిస్తున్నాడు. ఆదివారం కర్నూలు జిల్లా కామవరంలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల మార్కును దాటింది. ఈరోజు రాయలసీమ ప్రాంతాల్లో 42 డిగ్రీల వరకు, ఉత్తరాంధ్రలో 41డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో ఎండలోకి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News April 18, 2025
తిరుమలలో TTD ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు

AP: తిరుమలలో TTD ఛైర్మన్ BR నాయుడు ఆకస్మిక తనిఖీలు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులతో మాట్లాడి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అని అడిగి తెలుసుకున్నారు. TTD సాంకేతిక సేవల్లో కొన్ని లోపాలను ఓ భక్తుడు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు లడ్డూ, అన్నప్రసాదాలు రుచికరంగా ఉన్నాయని కొందరు తెలిపారు. అటు, దర్శన క్యూలైన్లనూ ఆయన పరిశీలించి.. భక్తులతో మర్యాదగా, సేవాభావంతో ప్రవర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.
News April 18, 2025
IPL: అభిషేక్ జేబులు చెక్ చేసిన సూర్య కుమార్

MI, SRH మధ్య నిన్న ముంబై వాంఖడేలో జరిగిన మ్యాచ్లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. SRH ఓపెనర్ అభిషేక్ శర్మ జేబులను సూర్యకుమార్ యాదవ్ చెక్ చేశారు. ఇటీవల పంజాబ్పై సెంచరీ చేసిన అనంతరం అభిషేక్ జేబులోంచి నోట్ తీసి ఆరెంజ్ ఆర్మీకి అంకితమంటూ సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్నటి మ్యాచ్లోనూ అలానే నోట్ రాసుకొచ్చారేమో అని SKY చెక్ చేయడం గ్రౌండ్లో నవ్వులు పూయించింది.
News April 18, 2025
కీవ్లో భారత ఫార్మా గోడౌన్పై దాడి.. ఉక్రెయిన్కు రష్యా కౌంటర్

కీవ్లో APR 12న భారత ఫార్మా గోడౌన్పై దాడి జరగ్గా, దానికి కారణం రష్యా క్షిపణి అని ఉక్రెయిన్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై రష్యా తాజాగా స్పందించింది.
ఉక్రెయిన్ క్షిపణుల వల్లే ఇది జరిగి ఉంటుందని కౌంటర్ ఇచ్చింది. ఆ దాడి తాము చేయలేదని భారత్లోని రష్యా ఎంబసీ స్పష్టం చేసింది. నివాస ప్రాంతాల్లో రాకెట్ లాంచర్లు, ఫిరంగులు సహా ఇతర సైనిక పరికరాలను మోహరించడం ఉక్రెయిన్కు పరిపాటిగా మారిందని మండిపడింది.