News April 7, 2025
సీతానగరం: ప్రియురాలు ఒప్పుకోకపోవడంతో మృతి

మనసుకు నచ్చిన మహిళ తనతో ఉండదని అనే విషయాన్ని జీర్ణించకోలేని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం పంచాయతీ పరిధిలోని వేమగిరి సునీల్ (26) స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరుసకు మరదలు అయిన సదరు సదరు మహిళను కలిసి ఉందామని అడగాగ ఆంగీకరించకపోవడంతో మనస్థాపం చెంది మృతి చెందాడని ఎస్సై రామకుమార్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News January 23, 2026
ప్రాథమిక రంగ పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం: ఇన్ఛార్జి కలెక్టర్

తూ.గో జిల్లాలో ప్రాథమిక రంగంలో పరిశ్రమలను నెలకొల్పేలా ఔత్సాహికులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ వై.మేఘ స్వరూప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజమండ్రిలో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, ఉద్యానవన శాఖలు పోస్ట్ హార్వెస్టింగ్ యూనిట్లను.. పశుసంవర్ధక శాఖ డైరీ, పాల ఉత్పత్తులకు సంబంధించిన పారిశ్రామిక యూనిట్లను ప్రోత్సహించాలన్నారు.
News January 23, 2026
తూ.గో జిల్లా అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

తూర్పుగోదావరి జిల్లాల్లోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ మొదటి ఏడాది సీట్ల భర్తీకి దరఖాస్తులను తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 19లోపు https://apbragcet.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 1, 2 తేదీల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయి.
News January 23, 2026
తూ.గో. జిల్లాలో కలిసిన 4 పోలీస్ స్టేషన్లు

జిల్లాల పునర్విభజనలో భాగంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గాన్ని తూ.గో జిల్లాలో విలీనం చేస్తూ కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీని ప్రకారం రామచంద్రాపురం సబ్ డివిజన్ పరిధిలోని మండపేట టౌన్, రూరల్, అంగర, రాయవరం పోలీస్ స్టేషన్లు రాజమహేంద్రవరం తూర్పు మండలం పరిధిలోకి వచ్చాయి. అలాగే, తూర్పు మండలంలోని బొమ్మూరు స్టేషన్ను దక్షిణ మండలానికి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


