News April 7, 2025

కాలువలో స్నానానికి దిగి యువకుడు గల్లంతు

image

రావులపాలెం మండలం గోపాలపురం బ్యాంక్ కాలవలో ఈతకోట నెక్కంటి కాలనీకి చెందిన షేక్ ఖాదర్ (21) ఆదివారం గల్లంతయ్యాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి మధ్యాహ్నం గోపాలపురం ఆరుమామిళ్ల రేవు వద్దకు స్నానానికి వెళ్లాడు. ఈత కొడుతూ ఖాదర్ గల్లంతయ్యాడు. ఇద్దరు స్నేహితులు స్థానికులకు విషయం తెలిపడం తో పోలీస్, ఫైర్ సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుని స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు ఆచూకీ లభించలేదు.

Similar News

News April 18, 2025

రూ.10 నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందంటే?

image

రెండు రంగులతో కనిపించే రూ.10 నాణేన్ని తయారు చేయడానికి ఆర్బీఐ రూ.5.54 ఖర్చు చేస్తుంది. కాయిన్ మధ్య భాగాన్ని కుప్రో నికెల్‌తో, బయటి సర్కిల్‌ను అల్యూమినియం కాంస్యంతో తయారు చేస్తారు. అలాగే, నాణెం బయటి వృత్తం 4.45 గ్రాములు, మధ్య భాగం 3.26 గ్రాములతో మొత్తం 7.71గ్రా. బరువు ఉంటుంది. గతంలో కొన్ని రోజులు ఈ నాణేలు చెల్లవని ప్రచారం జరిగినా, అవి చట్టబద్ధమైనవని ఆర్బీఐ అవగాహన కల్పించిన విషయం తెలిసిందే.

News April 18, 2025

NZB: జిల్లా ప్రజల ఆత్మీయతను మూట కట్టుకొని వెళ్తున్నా: జడ్జి

image

జిల్లా ప్రజలు, న్యాయవాదుల ఆత్మీయతను మూట కట్టుకొని వెళ్తున్నానని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికి గురువారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. న్యాయవాదులు, న్యాయమూర్తుల ఉమ్మడి లక్ష్యం కక్షిదారులకు కాలానుగుణంగా న్యాయ సేవలు అందించడమేనన్నారు. సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించే వరకు సమష్టిగా శ్రమించామని గుర్తు చేశారు.

News April 18, 2025

నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలి: మంత్రి దామోదర

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీల సంఖ్యను మరింత పెంచాలని అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో వైద్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. సరైన కారణం లేకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

error: Content is protected !!