News April 7, 2025
KKD: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న బుకీ అరెస్ట్

ఐపీఎల్ సీజన్ ప్రారంభమవడంతో హనుమకొండ పోలీసులు బెట్టింగ్ రాయుళ్లను ఆదివారం అరెస్ట్ చేశారు. ఏజెంట్లకు మధ్యవర్తిగా వ్యహరిస్తున్న కాకినాడకు చెందిన క్రికెట్ బుకీ వీరమణికూమార్ను అదుపులోకి తీసుకున్నారు. గోవాలోని యోగేశ్ గుప్తా బెట్టింగ్ లాభాల్లో 9% ఇస్తానని చెప్పడంతో పలువురితో బెట్టింగులు కట్టించాడు. కాకినాడలో ఓ ప్లాటు, రెండు మద్యం దుకాణాలు దక్కించుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Similar News
News July 7, 2025
NZB: శాంతాబాయి కుటుంబానికి సాయం చేయాలని సీఎం ఆదేశం

వేల్పూర్ మండలం రామన్నపేటకు చెందిన <<16959274>>80 ఏళ్ల వృద్ధురాలు<<>> శాంతాబాయి, ఆమె ముగ్గురు కుమారులకు CM రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ నుంచి అవసరమైన తోడ్పాటును అందిస్తామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. పుట్టుకతోనే అంధులుగా జన్మించిన ముగ్గురు కుమారులకు సపర్యలు చేయడానికి వృద్ధురాలు పడుతున్న ఇబ్బందులపై పలు మీడియాల్లో కథనం ప్రచురించగా ప్రభుత్వం స్పందించింది.
News July 7, 2025
శ్రీకాకుళం IIITలో 149 సీట్లు ఖాళీ

శ్రీకాకుళం IIIT క్యాంపస్కు సంబంధించి మొదటి విడత సీట్ల భర్తీ పూర్తయ్యింది. మొత్తం 1,010 సీట్లు ఉండగా 867 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 149 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించి ఈనెల 11,12వ తేదీలో రెండో విడత ప్రవేశాల లిస్ట్ విడుదల చేస్తారు. ఈనెల 14న క్లాసులు ప్రారంభమవుతాయి.
News July 7, 2025
‘అనకాపల్లి జిల్లాలో కల్తీ మద్యం.. ఇద్దరు అరెస్ట్’

కల్తీ మద్యం తయారు చేస్తూ ఈనెల రెండవ తేదీన పట్టుబడిన నిందితులు రుత్తల రాము, ఎలమంచిలి వెంకటేశ్వరరావును రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సుధీర్ తెలిపారు. ఆదివారం అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ.. వీరిద్దరూ కల్తీ మద్యం వ్యాపారాన్ని రెండున్నర ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుల వెనుక టీడీపీ నేత ఉన్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.