News April 7, 2025

సిరిసిల్ల: ఫుడ్ పాయిజన్.. మహిళా మృతి

image

ఫుడ్ పాయిజన్‌తో ఓ మహిళ ఆదివారం మృతిచెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన కాదాసు పుష్పలత (35), ఆమె కుమారుడు నిహాల్ (6) శుక్రవారం రాత్రి ఇంట్లో చపాతీలు తిని పడుకున్నారు. రాత్రి ఇద్దరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. వారిని కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పుష్పలత పరిస్థితి విషమించి ఆదివారం మరణించింది.

Similar News

News April 16, 2025

బాలానగర్: ‘గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం’

image

బాలానగర్ మండలంలోని గంగాధర్‌పల్లి గ్రామ శివారులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతైన ఘటన సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. ఎస్ఐ లెనిన్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందితో గాలింపు చేపట్టారు. శివరాములు (46) మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం MBNR ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. యాదయ్య మృతదేహం ఇంకా లభ్యం కాలేదు.

News April 16, 2025

ధరూర్: ‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి’

image

ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. బుధవారం కేటీదొడ్డి మండలం ముత్యాల, ధరూర్ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ నమూనాను పరిశీలించారు. ఇంటి నిర్మాణానికి వినియోగిస్తున్న మెటీరియల్, క్వాలిటీ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు.

News April 16, 2025

ఈరోజు నమాజ్ వేళలు(ఏప్రిల్ 16, బుధవారం)

image

ఫజర్: తెల్లవారుజామున 4.45 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.00 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు అసర్: సాయంత్రం 4.42 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.32 గంటలకు ఇష: రాత్రి 7.47 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

error: Content is protected !!