News April 7, 2025

వరంగల్: వేసవి వచ్చేసింది.. జాగ్రత్త!

image

వేసవి వచ్చేసింది. దీంతో ఉక్కబోత పెరిగింది. అయితే సాధారణంగా గ్రామాలు, పట్టణాల్లో ఉక్కబోత కారణంగా బయట పడుకుంటుంటారు. అదే అదనుగా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగారు ఆభరణాలు, ఫోన్లు దొంగిలించే అవకాశముందని చెబుతున్నారు. సెలవుల్లో ఊర్లకు వెళ్తే ఇంటికి తాళాలు వేసి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని, చిన్నారులను ఈతకు వెళ్లకుండా చూడాలని సూచిస్తున్నారు.

Similar News

News April 8, 2025

వరంగల్: ప్రజావాణికి 93 దరఖాస్తులు

image

వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్య శారద దేవి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ శాఖల నుంచి 93 దరఖాస్తులు రాగా.. రెవెన్యూ సమస్యలపై 41, మిగతా శాఖల నుంచి 52 వచ్చాయి. అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

News April 8, 2025

ఖానాపురం: రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే

image

ఖానాపురం మండల కేంద్రంలో ముస్తఫా అనే రేషన్ కార్డు లబ్ధిదారుడి ఇంట్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సన్న బియ్యం భోజనం చేశారు. ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చేందుకు సన్న బియ్యం పథకాన్ని చేపడుతోందని దొంతి అన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్, ఆర్డీవో ఉమారాణి, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

News April 8, 2025

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి: వరంగల్ కలెక్టర్

image

యాసంగి ధాన్యం కొనుగోలు కోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సత్య శారద దేవి తెలిపారు. ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 2024-25 సంవత్సరానికి 182 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు.

error: Content is protected !!