News April 7, 2025
వరంగల్: వేసవి వచ్చేసింది.. జాగ్రత్త!

వేసవి వచ్చేసింది. దీంతో ఉక్కబోత పెరిగింది. అయితే సాధారణంగా గ్రామాలు, పట్టణాల్లో ఉక్కబోత కారణంగా బయట పడుకుంటుంటారు. అదే అదనుగా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగారు ఆభరణాలు, ఫోన్లు దొంగిలించే అవకాశముందని చెబుతున్నారు. సెలవుల్లో ఊర్లకు వెళ్తే ఇంటికి తాళాలు వేసి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని, చిన్నారులను ఈతకు వెళ్లకుండా చూడాలని సూచిస్తున్నారు.
Similar News
News April 16, 2025
విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి: CMD

హనుమకొండ NPDCL కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి 16 సర్కిళ్ల ఎస్ఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఉద్యోగి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్కు అంతరాయం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు.
News April 16, 2025
ద్వేషమేమీ లేదు అభిజిత్కు కేక్స్ పంపుతా : రెహమాన్

సంగీత కార్యక్రమాల్లో తాను టెక్నాలజీ అధికంగా వాడుతాను అనేది సింగర్ అభిజిత్ అభిప్రాయమని దాన్ని గౌరవిస్తానని మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ అన్నారు. అలా అన్నందుకు అతనిపై ద్వేషం లేదని, ఆయనకు కేక్స్ పంపిస్తానని తెలిపారు. ఛావా, పొన్నియన్ సెల్వన్ చిత్రాలకు వందల మంది టెక్నీషియన్లతో కార్యక్రమాలు నిర్వహించానన్నారు. కాగా రెహమాన్ టెక్నాలజీ వాడడంతో కళాకారులకు ఉపాధి లేకుండా పోతుందని అభిజిత్ ఆరోపించారు.
News April 16, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ నరసరావుపేట: బోరుగడ్డ అనిల్కు రిమాండ్ పొడిగింపు
☞ జిల్లాలో అక్షరాస్యత పెంచాలని కలెక్టర్ ఆదేశాలు
☞ అమరావతి: హత్య కేసులో నిందితుడి అరెస్ట్
☞ పోలీసులపై వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఫైర్
☞ మాచర్లలో 700 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
☞ చిలకలూరిపేటలో గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి గాయాలు
☞ కారంపూడిలో ముస్లింల భారీ ర్యాలీ