News March 26, 2024

అనకాపల్లి: రైలు నుంచి జారిపడిన యువకుడు మృతి

image

రైలు నుంచి జారి పడి అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని యువకుడు(25) మంగళవారం మృతి చెందాడు. శారదానది బ్రిడ్జ్‌ సమీపంలో సోమవారం రాత్రి సమయంలో విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైల్వే ట్రాక్‌ సమీపంలో రైలు నుంచి యువకుడు జారి పడిపోయాడు. అటుగా వెళ్లే రైల్వే గ్యాంగ్‌మాన్‌ సమాచారంతో 108 అంబులెన్సులో ఆస్పత్రికి తర లించారు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు.

Similar News

News October 6, 2024

విశాఖ డెయిరీ అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి: జనసేన కార్పొరేటర్

image

విశాఖ డెయిరీ అవినీతి బాగోతంపై సమగ్ర దర్యాప్తు చేయాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆదివారం మాట్లాడారు. ఉత్తరాంధ్రలో విశాఖ డెయిరీకి మూడు లక్షల మంది పాడి రైతులు దశాబ్దాలుగా పాలు పోస్తూన్నారని, రూ.200 కోట్ల టర్నోవర్ ఉన్న ఈ డెయిరీ చరిత్రలో ఇప్పుడు నష్టాల బాటలో ఉన్నా ఆడారి కుటుంబం మాత్రం లబ్ది పొందిందన్నారు. డెయిరీ ఆస్తులపై CBI విచారణ చేయాలన్నారు.

News October 6, 2024

విశాఖ: ఉక్కు పోరాట కమిటీతో నేడు పవన్ కళ్యాణ్ భేటీ

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఆదివారం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులతో భేటీ కానున్నారు. స్టీల్ ప్లాంట్ యువ కార్మికులు శనివారం మంగళగిరి జనసేన కార్యాలయం ఎదుట ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. అక్కడ జనసేన నాయకులను కలిసి స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఈ నేపథ్యంలో తమను కలిసేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించినట్లు కమిటీ నాయకులు తెలిపారు.

News October 6, 2024

చింతపల్లి: కులం పేరుతో దూషించాడని స్నేహితుడినే చంపారు

image

కులం పేరుతో దూషించాడని లోతుగెడ్డ జంక్షన్ వద్ద అర్జున్ (50) అనే వ్యక్తిని ఇద్దరు స్నేహితులు కొట్టి చంపారు. గత నెల 27న పుష్పరాజ్, వెంకటేశ్, అర్జున్ అనే ముగ్గురు స్నేహితులు మద్యం తాగేందుకు లోతుగెడ్డ వెళ్లారు. అక్కడ మద్యం తాగుతున్న సమయంలో పుష్పరాజ్‌ను అర్జున్ కులం పేరుతో దూషించాడు. దీంతో అతడిని రాయితో కొట్టి హతమార్చారు. ఈమేరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని సీఐ రమేశ్, ఎస్సై అరుణ్ కిరణ్ తెలిపారు.