News April 7, 2025
MPC మీటింగ్ ప్రారంభం.. రేట్ తగ్గింపుపై ఉత్కంఠ

RBI మానిటరీ పాలసీ కమిటీ(MPC) సమావేశం ముంబైలో ప్రారంభమైంది. ఆర్థిక పరిస్థితులు, పాలసీ రేట్లపై సమీక్షించనుంది. FEBలో రెపోరేట్ను 6.5నుంచి 6.25కి తగ్గించిన విషయం తెలిసిందే. ఎకనామిక్ గ్రోత్ను ప్రోత్సహిస్తూ మరో 25 బేసిస్ పాయింట్స్ తగ్గించొచ్చని SBI అంచనా వేసింది. కొంతమంది నిపుణులు 50Pts కోత అవసరమంటున్నారు. దీనిపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీటింగ్ అనంతరం ఏప్రిల్ 9న ప్రకటన విడుదల చేయనున్నారు.
Similar News
News April 18, 2025
న్యాయవాదుల అభిమానం మరువలేనిది: జిల్లా ప్రధాన న్యాయమూర్తి

మెదక్ జిల్లా న్యాయవాదుల అభిమానం మరువలేనిదని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మి శారద అన్నారు. సూర్యాపేటకు బదిలీ అయిన సందర్భంగా మెదక్ కోర్టులో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సన్మానం ఏర్పాటు చేశారు. ఇక్కడ సేవలందించడం గొప్పవరం అన్నారు. ప్రతి న్యాయవాది పేద ప్రజలకు అండగా నిలబడాలన్నారు. మెదక్ జిల్లా న్యాయవాదుల అభిమానం వెలకట్టలేనిదని, ఇక్కడి ప్రజల అభిమానం మరువలేనిదని ఆమె పేర్కొన్నారు.
News April 18, 2025
జేఈఈ మెయిన్ ‘కీ’ విడుదల

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫైనల్ ‘కీ’ని ఎట్టకేలకు NTA విడుదల చేసింది. <
News April 18, 2025
MMTSలో అత్యాచారయత్నం కేసు.. బిగ్ ట్విస్ట్

కొద్దిరోజుల క్రితం HYD MMTSలో అత్యాచారయత్నం సందర్భంగా యువతి రైలు నుంచి కిందకి <<15866506>>దూకేసిన<<>> ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు యువతిపై అత్యాచార యత్నమే జరగలేదని విచారణలో తేలింది. రైలులో వెళ్తూ ఇన్స్టా రీల్స్ చేసిన ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ విషయం చెబితే అంతా తిడతారని భయపడి ఓ యువకుడు అత్యాచారం చేయబోగా కిందకి దూకేసినట్లు చెప్పింది. తాజాగా ఆమె నిజం ఒప్పుకోవడంతో పోలీసులు షాక్ అయ్యారు.