News March 26, 2024
ప.గో.: దివ్యాంగురాలిని నమ్మించి గర్భవతిని చేసి

ప.గో. జిల్లా పాలకోడేరు మండలకేంద్రానికి చెందిన పి.దుర్గా సూర్యనారాయణ రాజు అదే గ్రామానికి చెందిన ఓ దివ్యాంగురాలిని (యువతి) నమ్మించి గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని అతడిని కోరగా అతను నిరాకరించినట్లు దివ్యాంగురాలి తల్లి పార్వతి తెలిపింది. పోలీసులకు ఫిర్యాదుచేయగా..సదరు వ్యక్తిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News February 4, 2026
భీమవరం: రుణాల అంశంపై కలెక్టర్ అసహనం

భీమవరం కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. బ్యాంకర్లు సీసీఆర్సీ కార్డులు, పీఎం స్వనిధి, విద్య, ఎస్హెచ్జి, ముద్ర, తదితర రుణాలను జాప్యం లేకుండా లబ్ధిదారులకు మంజూరు చేయాలన్నారు. కొన్ని బ్యాంకులు రుణాల లక్ష్యసాధన తక్కువగా ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు.
News February 4, 2026
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

భీమవరం మండలం చినఅమిరం 1వ సచివాలయంలో బుధవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సర్వే ఏ విధంగా జరుతున్నది క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
News February 4, 2026
ప.గో: SMలో పరిచయమైన బాలికలపై అత్యాచారయత్నం

సోషల్ మీడియా పరిచయంతో ఇద్దరు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనపై మొగల్తూరు పోలీసులు మంగళవారం రెండు పోక్సో కేసులు నమోదు చేశారు. SI నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. యలమంచిలి(M)కి చెందిన బాలికలను పీఎం లంకకు చెందిన తిరుమాని దుర్గా ప్రసాద్, రాజేంద్రలు మొగల్తూరులోని ఓ లాడ్జ్కు పిలిచి, అత్యాచారయత్నం చేశారు. బాధితుల తల్లుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


