News April 7, 2025
బిల్ గేట్స్ పిల్లలకిచ్చే ఆస్తి ఎంతో తెలుసా?

తన ఆస్తిలో 1శాతం లోపే తన కుటుంబానికి ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్గేట్స్ తెలిపారు. వారు వారసత్వంగా వచ్చిన ఆస్తి ద్వారా కాకుండా స్వతంత్రంగా పైకి రావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓపాడ్కాస్ట్లో పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థను నడపమని వారిని కోరనని, వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకుని అందులో రాణించడమే తనకి ఇష్టమన్నారు. బిల్గేట్స్ మెుత్తం సంపద 155బిలియన్ డాలర్లు.
Similar News
News April 13, 2025
ప్రపంచంలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ ఇవే

ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ గేమ్గా ఫుట్బాల్ నిలిచింది. 3.5 బిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో సాకర్ మొదటిస్థానంలో కొనసాగుతోంది. 2.5 బిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో క్రికెట్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హాకీ (2 బిలియన్), టెన్నిస్ (1 బిలియన్), వాలీబాల్ (900 మిలియన్) టాప్-5లో నిలిచాయి. టేబుల్ టెన్నిస్, బాస్కెట్ బాల్, బేస్ బాల్, రగ్బీ, గోల్ఫ్ టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.
News April 13, 2025
2026 ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదే: అన్నామలై

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో NDA అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేను అధికారం నుంచి దించడమే లక్ష్యంగా AIADMK, బీజేపీ కలిసి పని చేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల అమిత్ షా పర్యటన తర్వాత పార్టీ మరింత బలపడిందని చెప్పారు. తాను పార్టీ కోసం పని చేసే సాధారణ కార్యకర్తనని, తమ కొత్త అధ్యక్షుడిని బలోపేతం చేసే దిశగా పని చేస్తానని ఆయన వివరించారు.
News April 13, 2025
అన్యాయంపై ప్రశ్నిస్తే నోటీసులిస్తారా?: హరీశ్ రావు

TG: గ్రూప్-1 అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన <<16075233>>రాకేశ్ రెడ్డి<<>>కి పరువు నష్టం దావా నోటీసులిస్తారా? అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అన్యాయాలను, అక్రమాలను నిలదీస్తే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూనే నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు చేస్తే వాస్తవాలు బయటపెట్టాల్సింది పోయి నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.