News April 7, 2025
దుబాయ్లో అయిలాపూర్ వాసి మృతి

కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన గాజర్ల శ్రీనివాస్ గౌడ్ (55) ఆదివారం రాత్రి దుబాయ్లోని తన గదిలో గుండెపోటుతో మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. శ్రీనివాస్ ఐదేళ్లుగా దుబాయ్లో పనిచేస్తున్నారు. మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తెప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Similar News
News April 8, 2025
KMR: బాలుర అదృశ్యం సుఖాంతం.. SP అభినందన

ఇద్దరు బాలుర అదృశ్యం కేసును బీర్కూర్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. బీర్కూర్ జ్యోతిబాఫూలేలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు 7వ తేదీన రాత్రి 9 గం.ల నుంచి కనిపించకుండా పోయారు. 8న సాయంత్రం కుటుంబ సభ్యులు PSలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందించారు.
News April 8, 2025
విద్యార్థులకు ట్రంప్ ఝలక్.. చిన్న తప్పు చేసినా వీసా రద్దు?

ట్రంప్ నిర్ణయాలు విదేశీ విద్యార్థుల పట్ల శాపంగా మారుతున్నాయి. చిన్న పాటి ట్రాఫిక్ ఉల్లంఘనలకూ వీసాలు రద్దు చేస్తున్నారని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. గాజాపై ఇజ్రాయిల్ దాడిలో హమాస్కు మద్దతుగా పోస్టులు పెట్టిన విద్యార్థుల వివరాలు అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. హార్వర్డ్, స్టాన్ఫర్డ్ వర్సిటీల అధికారులు సైతం ఆకస్మిక వీసాల రద్దుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
News April 8, 2025
మంగపేట: దెబ్బతిన్న వరి పంటలను పరిశీలిస్తున్న అడిషనల్ కలెక్టర్

మంగపేట మండలం నరసింహసాగర్, మోట్లగూడెం, మల్లూరు గ్రామాల్లో ఉన్న కురిసిన భారీ వర్షాల కారణంగా 80% వరి పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను మంగళవారం ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి, అధికారులు పరిశీలించారు. అనంతరం దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.