News April 7, 2025

అమలాపురం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 25 ఫిర్యాదులు

image

అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు 25 ఫిర్యాదులు అందాయని తెలిపారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఇతర సమస్యలపై అందిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలన్నారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎస్పీ కార్యాలయానికి నివేదించాలన్నారు.

Similar News

News April 8, 2025

పీఎం మోదీతో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ భేటీ

image

పీఎం నరేంద్ర మోదీతో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ భేటీ అయ్యారు. వీరిద్దరూ ఢిల్లీలో అత్యున్నత సమావేశం నిర్వహించారు. వీరితోపాటు విదేశాంగమంత్రి జైశంకర్, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఉన్నారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సహకారంపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా క్రౌన్ ప్రిన్స్ ఇవాళ, రేపు భారత్‌లో పర్యటిస్తారు.

News April 8, 2025

విశాఖలో ఈ ఏరియాలకు రిపోర్టర్లు కావలెను

image

విశాఖ నగరంలోని కొమ్మాది, జగదాంబ జంక్షన్, కేజీహెచ్, పోర్ట్ ఏరియా, పద్మనాభం, ఎండాడ, కైలాసగిరి, గాజువాక ఏరియాల్లో వే2న్యూస్‌లో పని చేసేందుకు రిపోర్టర్లు కావలెను. పబ్లిష్ అయిన ప్రతి వార్తకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింక్‌పై <>https://forms.gle/LKQkvvd4Ak5ztdrT6<<>> క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయగలరు.

News April 8, 2025

2026 నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి: మంత్రి రామ్మోహన్

image

AP: భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పనులు 71% పూర్తయ్యాయని పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఈ ఎయిర్‌పోర్ట్ ఒక్కటే అధునాతనమైందని, దీంతో దేశ రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నామని, 2026 నాటికి పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. మంత్రి ఇవాళ విమానాశ్రయ పనులను పరిశీలించారు.

error: Content is protected !!