News March 26, 2024
కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి

ట్రాక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున నరసాపురం, మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే ఎనిమిది రైళ్లు ఏప్రిల్ 1 నుంచి 28 వరకు రామవరప్పాడు వరకు మాత్రమే – నడవనున్నాయి. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయా తేదీలలో మచిలీపట్నం, నరసాపురం వైపు వెళ్లే ఈ రైళ్లు విజయవాడకు బదులుగా రామవరప్పాడు నుంచి బయలుదేరతాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు గమ్యస్థానంలో మార్పును గమనించాలని కోరాయి.
Similar News
News March 15, 2026
మచిలీపట్నంలో చికెన్ ధరల హీట్.. కేజీ ఎంతంటే!

మచిలీపట్నం మాంసం మార్కెట్లలో ఆదివారం ధరలు భగ్గుమన్నాయి. పట్టణ ప్రాంతంలో మటన్ ధర కేజీ రూ.1000కి చేరగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.800గా ఉంది. చికెన్ స్కిన్లెస్ కిలో రూ.300 పలుకుతోంది. చేపల మార్కెట్లో బొచ్చె కిలో రూ.200, సీలావతి రూ.170కి విక్రయిస్తున్నారు. సెలవు దినం కావడంతో మార్కెట్లు రద్దీగా మారాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 15, 2026
అవనిగడ్డ జనసేన, టీడీపీలో ముసలం!

అవనిగడ్డ కూటమి నేతల్లో ముసలం మొదలైంది. కోడూరు TDP అధ్యక్షుడు బండే శ్రీను, MLA బుద్దప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రోడ్ల కాంట్రాక్ట్ విషయంలో ఈ వైరం ముదిరింది. మిగిలిన మండలాల్లో వర్గభేదాలు బయటపడనప్పటికీ జనసేన, TDP నేతల మధ్య గ్యాప్ కనిపిస్తోంది. త్వరలో TDP నియోజకవర్గ ఇన్ఛార్జ్ను నియమిస్తారనే ప్రచారం ఉంది. దీంతో MLA కాంపౌండ్ నుంచి ఇన్ఛార్జ్ దగ్గరికి TDP నేతలు షిఫ్ట్ అవుతారని టాక్.
News March 14, 2026
9వ తరగతి నుంచే ‘పదో తరగతి’కి సన్నద్ధం: కలెక్టర్

వచ్చే విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కలెక్టర్ బాలాజీ వినూత్న కార్యాచరణ ప్రకటించారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇప్పుడే 10వ తరగతి సిలబస్పై దృష్టి పెట్టాలని సూచించారు. 2027 SSC పరీక్షల కోసం వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


