News April 7, 2025
HYD: ఈషాసింగ్ను అభినందించిన సీఎం

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్లో 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్లో హైదరాబాద్కు చెందిన ఈషా సింగ్ రజత పతకం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు అభినందనలు తెలిపారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో ఈషా సింగ్కు ఇది మొదటి పతకం కాగా ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో ఇది దేశానికి మూడో పతకం.
Similar News
News July 5, 2025
కుర్రాడు ఇరగదీస్తున్నాడు!

INDతో టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ యువ బ్యాటర్ జేమీ స్మిత్ అదరగొడుతున్నారు. రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్సులో 207 బంతుల్లోనే 4 సిక్సర్లు, 21 ఫోర్లతో 184 రన్స్ చేశారు. ఎక్కడా తడబడకుండా అటాకింగ్ బ్యాటింగ్తో అదుర్స్ అనిపించారు. తొలి టెస్టులో 84 రన్స్ చేశారు. 24 ఏళ్ల స్మిత్ 2019లో ఫస్ట్ క్లాస్ సెంచరీ బాదారు. గతేడాది టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఇంగ్లండ్ తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నారు.
News July 5, 2025
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై NRPT కలెక్టర్ సమీక్ష సమావేశం

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్తో కలిసి అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఓటర్ల జాబితాలు, భద్రతా ఏర్పాట్లు వంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.
News July 5, 2025
పట్టుబిగించిన భారత్.. లీడ్ ఎంతంటే?

ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు ఇంగ్లండ్ను 407కు ఆలౌట్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్లో ఒక వికెట్ కోల్పోయి 64 రన్స్ చేసింది. ఆట ముగిసే సమయానికి 244 పరుగుల లీడ్లో ఉంది. రాహుల్ 28*, కరుణ్ 7* క్రీజులో ఉన్నారు. అంతకుముందు సిరాజ్ 6, ఆకాశ్ 4 వికెట్లతో చెలరేగారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో స్మిత్ 184*, బ్రూక్ 158 రన్స్తో అదరగొట్టారు.