News April 7, 2025
ఆదిలాబాద్: ‘సమగ్ర సర్వే నిధులు విడుదల చేయాలి’

సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఎనిమిరేటర్ సూపర్వైజర్ కంప్యూటర్ ఆపరేటర్లకు తక్షణమే నిధులు వారి అకౌంట్లో జమా చేయాలని టీజీటీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ జాధవ్ కోరారు. ఈ విషయమై సోమవారం సీపీఓ ను కలిసి నిధులు విడుదల చేయాలని వినతిపత్రం సమర్పించారు. సర్వే చేసి నేటికీ ఆరు నెలలు గడుస్తున్న ప్రభుత్వం నేటికీ నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. ఈ నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 4, 2025
భీంపూర్ మండలంలో పులి సంచారం కలకలం..!

గత కొన్ని రోజులుగా భీంపూర్ మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా సోమవారం అంతర్గాం గ్రామస్థుల వ్యవసాయ పొలాల్లో పులి అడుగులు కనిపించాయని రైతులు తెలిపారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి అటవీ అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.
News November 4, 2025
అతివలకు అండగా షీటీం బృందాలు: ADB SP

అతివలకు షీటీం అండగా ఉంటుందని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యార్థినిలకు సైబర్ క్రైమ్, మహిళల వేధింపులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మహిళలు ఎలాంటి అత్యవసర పరిస్థితిలోనైనా డయల్ 100, 8712659953 నెంబర్ కి సంప్రదించవచ్చని సూచించారు. జిల్లాలోని హాట్స్పాట్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గత నెలలో రెండు బాల్యవివాహాలు నిలిపివేయడం జరిగిందన్నారు
News November 3, 2025
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు: ఎస్పీ

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలనుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించి విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మొత్తం 38 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఫోన్ ద్వారా సిబ్బందికి పరిష్కారం చూపాలని ఆదేశాలు ఇచ్చారు.


