News April 7, 2025

ఆదిలాబాద్: ‘సమగ్ర సర్వే నిధులు విడుదల చేయాలి’

image

సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఎనిమిరేటర్ సూపర్వైజర్ కంప్యూటర్ ఆపరేటర్లకు తక్షణమే నిధులు వారి అకౌంట్లో జమా చేయాలని టీజీటీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ జాధవ్ కోరారు. ఈ విషయమై సోమవారం సీపీఓ ను కలిసి నిధులు విడుదల చేయాలని వినతిపత్రం సమర్పించారు. సర్వే చేసి నేటికీ ఆరు నెలలు గడుస్తున్న ప్రభుత్వం నేటికీ నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. ఈ నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News March 2, 2026

మార్చి 10న మెగా జాబ్ మేళా.. పోస్టర్ ఆవిష్కరణ

image

ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా సందర్భంగా వన్ టౌన్ సీఐ బి.సునీల్ కుమార్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. మార్చి 10న ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో జరగనున్న ఈ జాబ్ మేళాలో 50కిపైగా కంపెనీలు పాల్గొని 2000కుపైగా ఉద్యోగాలు కల్పించనున్నాయి. నిరుద్యోగ యువతీయువకులు గూగుల్ ఫారమ్ QR Code లింక్ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.

News February 28, 2026

ADB జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్: SP

image

మార్చి ఒకటి నుంచి 31 వరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. డీఎస్పి లేదా ఆ పై స్థాయి అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని అన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News February 28, 2026

ADB: బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం

image

రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. కామారెడ్డి MLA రమణా రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీకి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు సిద్ధం కావాలని సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పాయల్ శంకర్, MLC అంజి రెడ్డి, MLAలు హరీష్ బాబు, రామారావు పాటిల్ పాల్గొన్నారు.